Thursday, May 2, 2024
- Advertisement -

జై తెలంగాణ అన్నోడు.. నై తెలంగాణ అంటున్నాడు

- Advertisement -

సీఎం కేసీఆర్‌పై వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ తన కొడుకును సీఎంను చేయాలని చూస్తున్నారన్నారు. చిన్న దొరను ఎందుకు సీఎంను చేయాలో చెప్పు పెద్ద దొరా అని ఎద్దేవా చేశారు. నీవు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినందుకు చేయాలా ? లేక స్కీముల పేరిట స్కాములు చేసినందుకు చేయాలా అని ప్రశ్నించారు. కాళేశ్వరం పేరిట లక్షల కోట్లు దోచుకున్నందుకు చేయాలా అన్నారు.

కేసీఆర్‌ పాలమూరు ప్రాజెక్టు ఏర్పాటు చేయకుండా దక్షిణ తెలంగాణను ఏడారిగా మార్చినందుకు కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలా అన్నారు. గతంలో 16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌గా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని 4.80 లక్షల కోట్ల అప్పులపాలు చేసినందుకు చేయాలా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ రైతులకు రుణమాఫీ, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానని మోసం చేశారన్నారు. పేదలకు వడ్డీ లేని రుణాలు, కార్పోరేషన్‌ లోన్లు ఇస్తామని దగా చేశారన్నారు.

ముఖ్యమంత్రి ఉద్యమ కారులను పక్కన పెట్టి ఉద్యమ ద్రోహులను అక్కున చేర్చుకున్నారన్నారు. గతంలో జై తెలంగాణ అన్నోడు ఇప్పుడు నై తెలంగాణ అంటున్నాడని విమర్శించారు. కేసీఆర్‌ పాలనను గమనిస్తున్న ప్రజలు సీఎంను గద్దె దించుదామని చూస్తుంటే.. కేసీఆర్‌ మాత్రం తన కొడుకును గద్దెనెక్కించాలని చూస్తున్నారన్నారు. కేసీఆర్‌ ఎన్నికల సమయంలో దళితులకు ఇస్తానన్న మూడెకరాల భూమిని వారికి ఇచ్చిన తర్వాతే ఓట్లు అడగాలన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -