- Advertisement -
ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ఈ ఏడాది ఏప్రిల్-6న లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కు వైసీపీ ఎంపీలు వరప్రసాద్ రావు, వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్రెడ్డి, మిథున్రెడ్డి, అవినాష్రెడ్డిలు రాజీనామా లేఖలు సమర్పించిన విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం ఢిల్లీకి వెళ్లిన వైసీపీ ఎంపీలు తమ రాజీనామాలు ఆమోదించాలని స్పీకర్ను కోరిన విషయం తెలిసిందే.
ఈనెల 7న రాజీనామాలపై వైసీపీ ఎంపీలు పునరాలోచించుకోవాలని, నిర్ణయం మారకపోతే రాజీనామాలు ఆమోదిస్తానని మరోసారి చెప్పారు. అయితే, సుమిత్రా మహాజన్ విదేశీ పర్యటనకు వెళ్లడంతో వారి రాజీనామాల ఆమోదం మరింత ఆలస్యం అయింది. ఎట్టకేలకు ఈరోజు లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ వైసీపీ ఎంపీల రాజీనామాలను ఆమోదించారు.