Thursday, May 16, 2024
- Advertisement -

చంద్ర‌బాబుది పోరాట దీక్ష‌కాదు…420 దీక్ష‌…అంబ‌టి ఫైర్‌

- Advertisement -

ఏపీ సీఎం చంద్ర‌బాబు చేసిన ధర్మపోరాట దీక్ష వైసీపీ నేత అంబ‌టి రాంబాబు నిప్పులు చెరిగారు. రాష్ట్ర‌ప్ర‌యోజ‌నాల‌పై బాబుకు ఏమాత్రం చిత్త‌శుద్ధిలేద‌ని విమ‌ర్శించారు. జపాన్ తరహాలో పని చేస్తూ ఉద్యమాలు చెయ్యాలని చెప్పిన చంద్రబాబు, నిన్న తన ధర్మపోరాట దీక్షను ఆ విధంగా చేయలేదన్నారు. రాష్ట్రంలో ఉన్న అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం మొత్తాన్ని తన ముందు కూర్చోబెట్టుకుని చంద్రబాబు ఈ దీక్ష చేశారని అన్నారు.

బాబు చేస్తున్న దీక్ష ధ‌ర్మ‌పోరాట దీక్ష‌కాని …420 దీక్ష‌ని ఎద్దేవ చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీ, సీపీఐ, సీపీఎంలు, జనసేన పార్టీ మీకు మద్దతు ఇవ్వలేద‌న్నారు. దీక్షలో పాల్గొనమని చెప్పిన పార్టీల వాళ్లందరూ ద్రోహులా….ప్రభుత్వ సొమ్ముతో చేసిన నిరాహార దీక్షఇదాని ప్ర‌శ్నించారు.

కర్ణాటక ఎన్నికలు అయిన తర్వాత తనపై దాడి చేస్తున్నారనే స్వరాన్ని వినిపించడానికి చంద్రబాబు నిన్న తీవ్రంగా ప్రయత్నం చేశారు. మోదీతోను, వారి తాబేదార్లతోనూ చంద్రబాబు ఇంకా రహస్య మంతనాలు చేస్తున్నారు’ అని విమర్శించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -