Wednesday, May 8, 2024
- Advertisement -

వైసీపీ మేనిఫెస్టో రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్‌..

- Advertisement -

జ‌న‌సేన పార్టీ త‌న మ్యానిఫెస్టోను ఇప్ప‌టికే విడుద‌ళ చేసింది. ఇక వైసీపీ కూడా మ్యానిఫెస్టోను విడుద‌ళ చేసేందుకు సిద్ద‌మైంది. ఉగాదిరోజున అంటే మరో రెండురోజుల్లోనే వైసీపీ మేనిఫెస్టో విడుదల చేయాలని ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నారు. అమ‌రావ‌తి వేదిక‌గా మ్యానిఫెస్టోను విడుద‌ల చేయ‌నున్నారు.మొత్తం 31 మందితో మేనిఫెస్టో కమిటీని నియమించారు జగన్. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఛైర్మన్‌గా ఉన్న ఈ కమిటీలో సీనియర్ నేతలు మేకపాటి, ధర్మాన, బోత్సతో పాటు పలువురికి చోటు కల్పించిన సంగ‌తి తెలిసిందే.

మ్యానిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలతో పాటు… నవరత్నాలన్నింటిని జగన్ మేనిఫెస్టోలో పొందుపరుస్తూ రూపొందించినట్లు తెలుస్తోంది. మేనిఫెస్టోలో ప్రధానంగా అమలుకు హామీ కాని వాగ్ధానాలకు పార్టీ దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.టీడీపీ మేనిఫెస్టో డ్రాప్ట్‌ని పరిశీలించిన వైసీపీ.. అంతకుమించిన అద్భుతమైన మేనిఫెస్టో రూపొందిస్తున్నట్లు సమాచారం. పాద‌యాత్ర‌, ఎన్నిక‌ల ప్ర‌చారంలో జ‌గ‌న్ ఇచ్చిన ఏ ఒక్క హామీని ప‌క్క‌న పెట్ట‌కుండా మ్యానెఫెస్టోలో పొందుప‌ర‌చాల‌ని క‌మిటీకి జ‌గ‌న్ సూచించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -