ప్రేమించిన వాడు మోసం చేస్తె అమ్మాయులు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు ఎక్కువగా జరుగుతుంటాయి. కాని ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. ఘాడంగా ప్రేమించిన ప్రేయసి మోసం చేయడంతో మనస్థాపం చెందిన యువకుడు పురుగల మందు తాగాఇ ఆత్యహత్య చేసుకున్నారు. ఈ సంఘటన తెలంగాణలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లిలో చోటుచేసుకుంది.
గోవిందరావుపేట మండలం చల్వాయికి చెందిన మహేందర్, కాల్వపల్లికి చెందిన ఓ యువతి నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరి కులాలు ఒకటే కావడంతో ఇద్దరం పెల్లి చేసుకోవాలనె నిర్ణయాన్ని పెద్దల దృష్టికి తీసుకెల్లారు. ఇంతలో ఏమయ్యిందో తెలియదుగాని మహేందర్ అంటె తనకు ఇష్టంలేదని అందరి ముందు చెప్పడంతో తీవ్ర మనస్థాపానికి చెందిన మహేందర్ పురుగుల మందు త్రాగి ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించారు. మహేందర్ కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.