అక్రమ మద్యం కేసులో అరెస్టయిన తల్లికి బెయిల్ మంజూరు చేసింది మధ్యప్రదేశ్ హైకోర్టు. తక్షణం జైలు నుంచి ఆమెను విడుదల చేయాలని జస్టిస్ సుజోయ్ పాల్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. ఇందుకోసం నిందితురాలు రూ.30వేలు సహా అంతే మొత్తాన్ని పూచికత్తుగా కూడా చెల్లించాలని పేర్కొంది.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఎనిమిది నెలల కుమారుడికి తోడుగా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఇండోర్లో ఆదివారం జరిగింది. సెలవురోజు కూడా విచారణ చేపట్టి కోర్టు బెయిల్ మంజూరు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
తల్లికి దూరంగా ఉండటం వల్లే చిన్నారి ఆరోగ్యం క్షీణించిందని డాక్టర్లు వెల్లడించారు.నిందితురాలు ఖుషీ యాదవ్ సహా మరో ఇద్దరు మహిళలు అక్రమ మద్యం విక్రయిస్తుండగా పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి గత నెల 29న పోలీసులు 197 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు నిమిత్తం స్థానిక కోర్టు ఈ నిందితులకు జుడీషియల్ కస్టడీని విధించింది.
నటుడు, నిర్మాత కుమారజన్ ఆత్మహత్య