- Advertisement -
30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ…తల పండిపోయింది రంగేశామంతె అనే డైలాగ్తో ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న నటుడు పృథ్వి . జగన్ , వైసీపీ అంటె ప్రాణం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి, ప్రస్తుతం ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఎన్నికల సమయంలో వైకాపా తరపున విస్తృతంగా ప్రచారం చేసిన ఆయన తాజాగా జగన్ సీఎం కావాలి అంటూ కాలినడక తిరుమల వెల్లి స్వామివారిని దర్శించుకున్నారు.
తాను తొలిసారిగా నడిచి కొండెక్కానని, వైఎస్ జగన్ సీఎం అయ్యే క్రమంలో ఆటంకాలు కలుగకుండా చూడాలని స్వామిని మొక్కుతున్నానని అన్నారు. జగన్ సీఎం కావాలని కోరుతూ తలనీలాలు సమర్పిస్తానని చెప్పారు. ఏపీ ప్రజలంతా జగన్ సీఎం కావాలని అనుకుంటున్నారని, ఈ నెల 23న అమరావతి కోటపై వైసీపీ జెండా ఎగురుతుందని అన్నారు.