Wednesday, May 22, 2024
- Advertisement -

అగ్రిగోల్డ్ స్కాం వెనుకు లోకేష్ మాస్ట‌ర్ మైండ్‌ …భాజాపా అధ్య‌క్షుడు క‌న్నా

- Advertisement -

ఐటీ మంత్రి లోకేష్‌, చ‌ద్ర‌బాబుల‌పై భాజాపా ఏపీ అధ్య‌క్షుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అగ్రిగోల్డ్ ఆస్తుల‌ను అప్ప‌నంగా కొట్టేసేందుకు బాబు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఆరోప‌న‌లు చేశారు.సోమవారం నాడు విజయవాడలో అగ్రి గోల్డ్ బాధితులకు మద్దతుగా బిజేపీ ప్రారంభించిన ఐదు రోజుల రిలే నిరహార దీక్షల్లో ఆయన మాట్లాడారు.

రాష్ట్ర ప్రభుత్వ అవినీతి వల్లే బాధితులకు న్యాయం జరగడం లేదని ఆయన విమర్శించారు. 3 వేల కోట్ల విలువైన హాయ్‌ల్యాండ్‌ను మంత్రి లోకేష్ రూ. 270 కోట్లకు కాజేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.అగ్రిగోల్డ్ ను ఇబ్బంది పెట్టించి, కుంభకోణం జరిగినట్టు చూపించి, వేలాది మందిని ఇబ్బంది పెట్టారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ నిప్పులు జెరిగారు.

అగ్రిగోల్డ్ కుంబ‌కోణం అంతా నారా లోకేష్ క‌నుస‌న్న‌ల్లో గురుతోందన్నారు.అగ్రిగోల్డ్ బాధితులకు అండగా నిలుస్తామని వెల్లడించిన ఆయన, బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లోకేశ్ అడిగిన ధరకు హాయ్ లాండ్ ను ఇవ్వలేదని, ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తుల విలువను ప్రభుత్వం రోజురోజుకూ తగ్గిస్తున్నారన్న కన్నా, ఈ విషయంలో సంస్థ యాజమాన్యం, ప్రభుత్వం కుమ్మక్కయ్యాయని ఆరోపించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -