Friday, April 26, 2024
- Advertisement -

పంజాబ్​లో కొత్త పొత్తు..! బీజేపీకి నష్టం తప్పదా?

- Advertisement -

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పంజాబ్​లో కొత్త పొత్తు పొడిచింది. అక్కడ శిరోమణి అకాలీదళ్, బీఎస్పీ పొత్తు కుదర్చుకున్నాయి. దీంతో పంజాబ్​ రాజకీయం ఆసక్తికరంగా మారింది. గతంలో శిరోమణి అకాలీదళ్​ .. ఎన్డీయేతో పొత్తుపెట్టుకున్న విషయం తెలిసిందే.అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై పంజాబ్​, హర్యానా రాష్ట్రాల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ క్రమంలో శిరోమణి అకాలీదళ్​ ఎన్డీయే నుంచి తప్పుకున్నది. కేంద్రమంత్రిగా ఉన్న హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ తన పదవికి రాజీనామా చేశారు.

ప్రస్తుతం శిరోమణి అకాలీదళ్.. బీఎస్పీతో పొత్తు కుదర్చుకున్నది. మొత్తం 117 స్థానాలున్న పంజాబ్​లో బీఎస్పీకి 20 సీట్లు కేటాయించారు. శిరోమణి అకాలీదళ్ 97 స్థానాల్లో పోటీచేయబోతున్నది. ఈ సందర్భంగా శిరోమణి అకాలీదళ్​ చీఫ్​ సుఖ్‌బీర్‌సింగ్‌ బాదల్‌ మాట్లాడుతూ.. పంజాబ్ రాజకీయాల్లో ఇది ఒక చరిత్రాత్మకమైన రోజని పేర్కొన్నారు. అయితే అకాలీదళ్​ బీఎస్పీకి ఉన్న దళితుల ఓటు బ్యాంకును దృష్టిలో ఉంచుకొని పొత్తుకు మొగ్గుచూపినట్టు సమాచారం.

Also Read: యూపీ సీఎం యోగిని మార్చేస్తారా? నిజమెంత?

రాష్ట్రవ్యాప్తంగా దళితులకు 32 శాతం ఓటు బ్యాంక్​ ఉంది. జలంధర్, హోషియార్‌పూర్, నవాన్‌షహర్, కపుర్తలా జిల్లాల్లో దళితుల ప్రభావం ఎక్కువ. దీంతో ఆ సారి తమ కూటమికి తిరుగులేదని అకాలీదళ్​, బీఎస్పీ భావిస్తున్నాయి.గతంలో ఎన్డీయే తో పొత్తు పెట్టుకోవడం వల్ల దళితులు తమకు దూరమయ్యారని.. వారంతా కాంగ్రెస్​కు ఓటేశారని అకాలీదళ్​ భావిస్తున్నది. ప్రస్తుతం బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడం వల్ల దళితులు తమ వైపునకు వచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ లెక్కలు వేసుకుంటున్నది.

Also Read: బెంగాల్​లో బీజేపీకి కోలుకోలేని దెబ్బ.. సొంత గూటికి ముకుల్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -