గతకొన్ని రోజులుగా ఏపీలో జనసేన వర్సస్ వైసీపీ మద్య రాజకీయ రగడ కొనసాగుతోంది. ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు చేసుకుంటున్న విమర్శలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి. ముఖ్యంగా వైజాగ్ లో జరిగిన విశాఖ గర్జన తరువాత ఈ రెండు పార్టీల మద్య రాజకీయ వివాదం అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. విశాఖలో పవన్ పర్యటనను ఏపీ ప్రభుత్వం అడ్డుకోవడం, వైసీపీ నేతలపై జనసైనికులు దాడికి దిగడం ఇలా చాలా సంఘటనలు పోలిటికల్ హిట్ ను ఒక్కసారిగా పెంచాయి. ఆ తరువాత మంగళగిరి పవన్ చేసిన వ్యాఖ్యలు కూడా పెను సంచలనం అయిన సంగతి విధితమే.
వైసీపీ నేతలను ఉద్దేశించి.. ” ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతా నా కొడకళ్ళారా.. ” అంటూ భూతులతో పవన్ విరుచుకుపడ్డారు. దీంతో అప్పటి నుంచి పవన్ టార్గెట్ గా వైసీపీ నేతలు తరచూ విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇక పవన్ వ్యాఖ్యలను ఉద్దేశించి ఇటీవల సిఎం జగన్ కూడా ప్రస్తావించారు. జనసేన కాదు రౌడీ సేన అంటూ నర్సాపురం సభలో ఘాటుగా విమర్శించారు. జగన్ జనసేన పార్టీని రౌడీ సేన అనడంపై జనసైనికుల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదురవుతున్నాయి. సిఎం జగన్ కు అసహనం ఆందోళనలు పెరుగుతున్నాయని.. అందుకే జనసేనపై విషం చిమ్ముతున్నారని నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు.
జనసేన ఎందుకు రౌడీ సేన అయిందో చెప్పాలని, డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలు ఏర్పాటు చేసినందుకా ? , మీకు గుడ్ మార్నింగ్ చెప్పి రోడ్ల దుస్థితి తెలిపినందుకా ? ఇళ్ల పేరిట చేసిన అవినీతి బయట పెట్టినందుకా ? ఎందుకు రౌడీసేన అయిందో చెప్పాలని నాదెండ్ల మనోహర్ తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. ఇక పవన్ మంగళగిరిలో మాట్లాడినా వీడియో ను షేర్ చేస్తూ మంత్రి అంబటి రాంబాబు ” రౌడీ సేన కాక ఇంకేంటి ‘ అంటూ ట్విట్టర్ లో ప్రశ్నించారు. ఇలా మొత్తానికి ఏపీలో జనసేన వర్సస్ వైసీపీ మద్య రాజకీయ రగడ రోజురోజుకూ తీవ్రమౌతోంది.
ఇవి కూడా చదవండి
ఈసారి డౌటే.. మోడీకి షాక్ తప్పదా ?