Monday, April 29, 2024
- Advertisement -

చంద్రబాబు బెదిరిస్తున్నారు .. జగన్ హాట్ కామెంట్స్!

- Advertisement -

ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు కర్నూల్ పర్యటనలో భాగంగా కొన్ని సంచలన వ్యాఖ్యాలు చేసిన సంగతి తెలిసిందే. ఇవే తనకు చివరి ఎన్నికలని, ఈ ఒక్కసారి టీడీపీని గెలిపించండి అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించిన సంగతి విధితమే. కాగా చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ముఖ్యంగా బాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ తీవ్రంగా విమర్శలు చేస్తోంది. ప్రజల నుంచి సింపతీ పొందేందుకే చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, ఇవ్వని చంద్రబాబు వ్యూహంలో భాగమేనని వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే చంద్రబాబు తన మనసులోని మాటనే చెప్పారని మరికొంత మంది రాజకీయ వాదుల నుంచి వినిపిస్తున్న మాట.

ఈ నేపథ్యంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సి‌ఎం జగన్ కాస్త ఘాటుగా స్పంధించారు. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం నియోజిక వర్గంలో పర్యటించిన ఆయన రూ.3,300 అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ” ఈ మద్య కాలంలో చంద్రబాబు మాట్లాడుతూ.. తనను గెలిపిస్తే సరేసరి లేకపోతే.. ఇవే తనకు చివరి ఎన్నికలౌతాయని ” చంద్రబాబు ప్రజలను భయపెడుతున్నారని.. సి‌ఎం జగన్ అన్నారు. కుప్పంలోనే తనకు గెలుపు కష్టమని బాబు ముందే గ్రహించారని, ఆయనలో అందుకే నిరాశ నిస్పృహలు స్పష్టంగా కనిపిస్తున్నాయని జగన్ చెప్పుకొచ్చారు. దత్త పుత్రుడు పవన్ కల్యాణ్ ను, చంద్రబాబును నమ్మొద్దని, మీకు మన ప్రభుత్వం ద్వారా మంచి జరిగిందా లేదా అనేది ఆలోచించి, మంచి జరిగిందని అనిపిస్తే మరోసారి ఆశీర్వదించండి అంటూ జగన్ చెప్పుకొచ్చారు.ప్రస్తుతం వైసీపీ వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే.. బాబు చేసిన ” చివరి ఎన్నిక ” అనే వ్యాఖ్యను.. ప్రధాన విమర్శనాస్త్రంగా ఉపయోగించుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఉత్తరాంధ్రలో అల్లర్లు.. బాబు స్కెచ్!

పవన్ మాతోనే ఉంటాడు.. ఉండేటట్లు చేస్తాం !

పాలిటిక్స్ కు పవనే కరెక్ట్: చిరంజీవి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -