Thursday, May 2, 2024
- Advertisement -

జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలో చేరిన మాజీ మంత్రి..

- Advertisement -

ఒక వైపు జ‌గ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారం…మ‌రో వైపు పార్టీలోకి వ‌ల‌సలు కొన‌సాగుతున్నాయి.కడప జిల్లా మైదుకూరులో జగన్ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి డీఎల్ పార్టీ కండువా కప్పుకున్నారు. జ‌గ‌న్ కండువా క‌ప్పి సాద‌రంగా పార్టీలోకి ఆహ్వానించారు. అంత‌రం బాబుపై నిప్పులు చెరిగారు. 2004లో జ‌రిగిన సీనె రిపీట్ అవుతుంద‌ని జోష్యం చెప్పారు.

2004లో వైఎస్సార్ చేతిలో చంద్రబాబు ఎలా ఓడిపోయారో, 2019లో కూడా జగన్ చేతిలో అలాగే ఓడిపోతారని ఓ ఇంగ్లీషు దినపత్రిక రాసిందని, ఇప్పుడది నిజం కాబోతుందని అన్నారు. బాబు పాల‌న అంతా అవినీతి మ‌యం అయ్యింద‌ని జ‌న్మ‌భూమి క‌మిటీల పేరుతో రాష్ట్రాన్ని దోచుకుంటున్నార‌ని ఆరోపించారు. ప్రజలందరూ తమ ఓటు హక్కును ఎంతో విలువైనదిగా భావించి చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి వినియోగించుకోవాలని డీఎల్ పిలుపునిచ్చారు.

ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ నాయ‌క‌త్వంపై ప్ర‌శంస‌లు కురిపించారు. నువ్వు నేను కలిస్తే, మనం, మనం… మనం కలిస్తే జనం, జనం జనం కలిస్తే కలిస్తే వైఎస్ జగన్ అంటూ కొనియాడారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన ప్రియ మిత్రుడు అని ఆయన తనయుడు వైఎస్ జగన్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రానికి కాబోయె ముఖ్య‌మంత్రి జ‌గ‌నే అన్నారు. రాబోయే ఎన్నికల్లో మైదుకూరు ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామిరెడ్డి, ఎంపీ అభ్యర్థి అవినాష్‌ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -