Tuesday, May 21, 2024
- Advertisement -

ఏపీ బీజేపీలో కలకలం

- Advertisement -

కన్నా ఎపీసోడ్‌ తర్వాత ఏపీ కమలం పార్టీలో కల్లోలం మొదలైందా.. కాశాయం క్యాంపు నుంచి వలసలు ప్రారంభమయ్యాయా.. బీజేపీని వీడేందుకు కొందరు ముఖ్య నేతలు రెడీగా ఉన్నారన్న కన్నా వ్యాఖ్యల వెనుక మర్మమేంటీ అసలు కన్నా బీజేపీని వీడిన తర్వాత ఆ ఎపీసోడ్‌పై బీజేపీలో జరుగుతున్న చర్చ ఏంటి

ఏపీ బీజేపీలో రోజు కోజుకూ మారుతున్న పరిణామాలు ఆ పార్టీ నేతల్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. పార్టీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ సోము వీర్రాజుపై వ్యతిరేకతతో టీడీపీలో చేరడంతో బీజేపీని ఓ కుదుపు కుదుపేసింది. సామాజిక సమీకరణాలను అనుకూళంగా మార్చుకోవాలని చూస్తున్న కమళం పార్టీకి ఏరి కోరి తెచ్చుకున్న కన్నా.. ఓ పోటు పొడిచే వెళ్ళారని కమళం నేతలు చర్చించుకుంటున్నారు. రెండు సార్లు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగిన కన్నా లక్ష్మి నారాయణను తొలగించి సోము వీర్రాజును నియమించడంతోనే రగడ మొదలైనట్లు కమళం నేతలు చెవులు కొరుక్కుంటున్నారు.

తనను కాదని అధ్యక్ష పదవి మరొకరికి ఇవ్వడం, పదవి పొందగానే సోము వీర్రాజు కన్నాను లెక్క చేయకుండా ఇష్టారీతిన వ్యవహరించడం కన్నాకు నచ్చలేవదనే టాక్‌ వినిపిస్తోంది. దీంతో పాటు సోమువీర్రాజు కొన్ని సందర్భాల్లో కన్నాపై పరోక్ష విమర్శలు సైతం చేశారు. దీంతో కన్నా లక్ష్మీ నారాయణ పార్టీ సమావేశాలకు దూరంగా ఉన్నా.. సోము వీర్రాజు మాత్రం కన్నా ఇంటికి వెళ్లలేదని కమళం నేతలు చెప్పుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -