ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మరోసారి ఫైర్ అయ్యారు. చంద్రబాబుది ఎప్పుడూ రెండు కళ్ల సిద్ధాంతమేనని ఆయన మండిపడ్డారు.చంద్రబాబు రాష్ట్ర ద్రోహి అని, రాజధాని నిర్మాణం పేరుతో ఇటుకల కోసం తీసుకున్న డబ్బు ఏం చేశారంటూ ప్రశ్నించారు. రాజధాని నిర్మాణం కోసం కేంద్రం ఇచ్చిన నిధులతో టిడిపి ప్రభుత్వం ఒక్క పనికి కూడా శంకుస్థాపన చేయలేదని ధ్వజమెత్తారు.
ఇప్పటివరకు అమరావతి నిర్మాణానికి సంబంధించి మాస్టర్ప్లాన్ ఇవ్వకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారని చంద్రబాబుపై మండిపడ్డారు…మాస్టర్ ప్లాన్ బీరువాలో దాచారా అని ప్రశ్నించారు.రాజధాని నిర్మాణం కోసం అమరావతి బాండ్ల జారీ ద్వారా సేకరించిన రూ.2000 కోట్ల రూపాయలకు లెక్కలు చెప్పాలని కన్నా డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్కు తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్తో దోస్తీ కట్టిన బాబు ముమ్మాటికీ ఆంధ్రా ద్రోహి, పచ్చి అవకాశవాది అని కన్నా మండిపడ్డారు
బీజేపీతో ఉంటూనే, రాహుల్తో చంద్రబాబు సంప్రదించారని.. 2014లో కాంగ్రెస్సే ఏపీకి అన్యాయం చేసిందని చెప్పిన చంద్రబాబు, 2019 నాటికి కాంగ్రెస్నే మంచిదంటున్నారని మండిపడ్డారు.