ఇటీవలే సీఎం వైఎస్ జగన్ వరస ఢిల్లీ టూర్ల్ తో ఆంధ్రా రాజకీయాలలో హీట్ పుటిస్తున్నాయి. ఈనేపద్యంలో మరోమారు జగన్ ఢిల్లీ టూర్.. అది కూడా ఈసారి సతీసమేతంగా అన్న వార్త ఆంధ్రాలో హాట్ టాపిక్ గా మారింది.
గత నెలలోనే వరసగా రెండు సార్లు ఢిల్లీ వెల్లిన జగన్ ప్రదాని మోడీ , అమిత్ షా, జలవనరుల మంత్రి గజేంద్ర షెకావత్ లతో భేటీ అయ్యారు. ఢిల్లీ పెద్దలను కలిసిన తరువాత జస్టిస్ రమణపై సీజేఐకి లేఖలు రాశారు జగన్. ఈ లేఖ ఎంత దుమారం లేపుతుందో తెలిసిన విషయమే.. జగన్ ఢిల్లీ వెళ్ళగానే రాష్ట్ర మీడియాలో రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఎన్డియేలో చేరబోతున్నారాని, నిధుల కోసం అని మరికొందరు అన్నారు. అయితే సిఎం జగన్ ఢిల్లీ ఎందుకు వెళ్ళింది, ఏంటీ అనేది అటు కేంద్రం కానీ, బిజెపి నాయకులూ కానీ, వైకాపా నాయకులూ కానీ ఎవరూ కచ్చితంగా చెప్పలేదు.
అయితే ఇప్పుడు సతీసమేతంగా ఢిల్లీకి వెళ్ళి ప్రధాని మోదీని కలవబోతున్నారని.. ఇప్పటికే ప్రధాని మోదీ అపాయింట్ మెంట్ కూడా తీసుకున్నారంటు వార్తలు వస్తునాయి. అసలు ఈ వార్తలో వాస్తం ఎంత..? వాస్తం అయితే ఎందుకు సతీసమేతంగా ఢిల్లీకి వెళ్ళి ప్రధాని మోదీని కలవబోతున్నారు అన్న వార్త ఆంధ్రాలో హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ వార్త పై వైసీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.
విద్యార్థులకు జగన్ సర్కార్ భారీ ఊరట
తప్పు చేస్తే పోలీసులను వదలం : సీఎం జగన్