Tuesday, May 7, 2024
- Advertisement -

బాబు వ్యాఖ్య‌ల‌కు దిమ్మ‌తిరిగే కౌంట‌ర్ ఇచ్చిన హోంమంత్రి సుచ‌రిత‌..

- Advertisement -

చంద్ర‌బాబు భ‌ద్ర‌తా వ్య‌వ‌హారం రెండు పార్టీల మ‌ధ్య మాట‌ల యుద్ధం సాగుతోంది. బాబు భ‌ద్ర‌త జ‌గ‌న్ ప్ర‌భుత్వం కుదించార‌ని బాబుతో పాటు ఆపార్టీనేత‌లు నానా యాగి చేస్తున్నారు. భ‌ద్ర‌త‌ను త‌గ్గించ‌లేద‌ని డీజీపీ గైత‌మ్ స‌వాంగ్ స్వ‌యంగా చెప్పినా టీడీపీ నేత‌లు ఆరోప‌న‌లు చేయ‌డంలో వెన‌క్కి త‌గ్గ‌డం లేదు.

చంద్రబాబునాయుడు తనకు భద్రత కుదించడాన్ని సవాల్ హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. తాజాగా భ‌ద్ర‌త‌పై బాబు చేస్తున్న వ్యాఖ్య‌ల‌కు హోమంత్రి సుచ‌రిత కౌంట‌ర్ ఇచ్చారు. చంద్రబాబుకు భద్రత తగ్గించినట్టు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆమె తెలిపారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉందని తెలిపిన సుచరిత… రూల్స్‌లో ఉన్న దానికంటే ఎక్కువగానే ఆయనకు సెక్యూరిటీ ఇస్తున్నట్టు స్పష్టం చేశారు.నిబంధనల ప్రకారం చంద్రబాబుకు 58 మంది సిబ్బందిని కేటాయించాల్సి ఉన్నా… తాము మాత్రం 74 మంది సిబ్బందిని కేటాయించామని వివరించారు.

బుల్లెట్ ఫ్రూఫ్ వాహనంతో పాటు ఎస్కార్ట్ వాహనం కూడా కేటాయించామని తెలిపారు. భ‌ద్ర‌త కావాల‌ని బాబు ప్ర‌భుత్వాన్ని అడ‌గ‌లేద‌న్నారు.చంద్రబాబు ఇప్పటికీ తాను ముఖ్యమంత్రిని అనే భావనలో ఉన్నారని… ఆయన ప్రతిపక్ష నాయకుడు అనే విషయాన్ని గుర్తుంచుకుంటే బాగుంటుందని హోంమంత్రి సుచరిత వ్యంగ్య‌స్త్రాలు సంధించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -