Thursday, May 16, 2024
- Advertisement -

బాబు నుంచి చింత‌మ‌నేనికి పిలుపు…

- Advertisement -

దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది ఆర్టీసీ. ఓ ఆర్టీసీ బస్సుపై ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ఉన్న ఓ చిత్రంపై చంద్రబాబు ముఖాన్ని ఎవరో చించేశారు. దీన్ని గమనించిన చింతమనేని తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. వెంటనే బస్సును అక్కడే నిలిపివేసి డ్రైవర్, కండక్టర్లను దుర్భాషలాడారు. ప్రయాణికుల్ని కూడా కిందకు దించేసి, వేరే బస్సులోకి ఎక్కించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా, గరికపాటి నాగేశ్వరరావు అనే స్థానికుడు ప్రశ్నించే ప్రయత్నం చేయగా, అతనిపై చింతమనేని చేయి చేసుకున్నారు.

తమను దుర్భాషలాడారంటూ చింతమనేనిపై ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ లు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆర్టీసీ ఎండీ ఐపీఎస్ అధికారి సురేంద్రబాబు ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి దుశ్చర్యకు పాల్పడినందుకు ఎలాంటి సెక్షన్ల కింద ఎలాంటి కేసులను బనాయించవచ్చునో.. ఆయన మొత్తం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. వాటిలో కొన్ని నాన్ బెయిలబుల్ సెక్షన్లు కూడా ఉన్నాయని అమరావతిలో గుసగుసలు వినిపిస్తున్నాయి. సురేంద్రబాబు.. ఈ విషయంలో ఏమాత్రం ముందడుగు వేసి ప్రొసీడ్ అయినా సరే.. చింతమనేనికి చిక్కులు తప్పవు అని అంతా అనుకుంటున్నారు.

చింతమనేని విషయంలో పార్టీ స్పందించాల్సిన అవసరం ఉంద‌ని సీనియ‌ర్లు బాబుకు సూచించినా అంత‌గా ప‌ట్టించుకోలేదు. కాని ఈ ఇష్యూనీ ఆర్టీసీ ఎండీ సీరియ‌స్‌గా తీసుకోవ‌డంతో బాబు స్పందించారు. దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను కలవాలంటూ ఆయన ఆదేశించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -