కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం టీడీపీలో విభేదాలు మరోసారి రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. తమ మధ్యన విభేదాల పరిష్కారానికి టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు మంత్రి అఖిలప్రియను పిలిచినా ఆమె రాలేదని సుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. ఈ రోజు బాబు దగ్గర జరగాల్సిన పంచాయితీ వాయిదా పడింది. భూమా కుటుంబంతో తనకున్న సంబంధాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏవీ సుబ్బారెడ్డి.
ఎప్పుడైతే నాపై రాళ్లదాడి జరిగిందో అప్పుడే భూమా కుటుంబంతో సంబధాలు తెగిపోయాయని తేల్చి చెప్పారు. ఇప్పటి నుంచి అఖిలను రాజకీయ శత్రువుగానే చూస్తానన్నారు. తనపై రాళ్లదాడికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని వాటన్నింటినీ బాబు దగ్గర ప్రస్తావిస్తానన్నారు.
తమ పార్టీ అధిష్ఠానం ఏది చెబితే అది పాటించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. రాళ్ల దాడి జరిగిన రోజున కూడా తాను అధిష్ఠానం సూచన మేరకే సైకిల్ యాత్ర చేశానని చెప్పారు. ఏమైనా ఉంటే ఉంటే రాజకీయంగా చూసుకోవాలి కానీ, ఇటువంటి చర్యలకు పాల్పడవద్దని హితవు పలికారు. ఇక అఖి ఒంటరి అయినట్టేనని రాజకీయ వర్గాలు అంటున్నాయి.