- Advertisement -
బోయిన్పల్లి అపహరణ కేసులో ఏ1గా ఉన్న భూమా అఖిలప్రియ బెయిల్ పిటిషన్పై సందిగ్ధత కొనసాగుతోంది. అఖిల ప్రియ బెయిల్ పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న భార్గవ్రామ్, విఖ్యాత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పైనా సెషన్స్ కోర్టులో విచారణ చేపట్టనుంది.
అఖిల ప్రియ పిటిషన్పై శుక్రవారం విచారణ జరగగా.. ఆమెకు బెయిల్ మంజూరు చేయొద్దని పోలీసులు కోరారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే అఖిల ప్రియ బెయిల్ పిటిషన్లు రెండుసార్లు తిరస్కరణకు గురయ్యాయి. నేడు జరిగే విచారణతో ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో ఇప్పటికే భూమా అఖిల ప్రియ సహా పలువురిని అరెస్టు చేయగా… ఆమె భర్త భార్గవ్రామ్, కుటుంబ సభ్యలు పరారీలో ఉన్నారు.
రైతు పొలంలో అధ్బుతం.. రెక్కలతో బల్లి.. ఎంత దూరం ఎగురుతుంది..!
హైకోర్టు తీర్పును సవాలు చేసిన ప్రభుత్వం