కర్నటాక రాజకీయా సమీకరణాలు క్షణ క్షణానికి మారిపోతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు భాజాపా, కాంగ్రస్,జేడీఎస్ కూటములు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. కాంగ్రెస్ ఒక అడుగు ముందుకేసి జేడీఎస్కు పూర్తి మద్దతు తెలిపింది. భాజాపా లార్జెస్ట్ పార్టీగా అవతరించినా ప్రభుత్వాన్ని ఏర్పాటే చేసే మ్యాజిక్ ఫిగర్ను చేరుకోకపోవడంతో జేడీఎస్-కాంగ్రెస్ కూటమికి చెక్ పెట్టేందుకు భాజాపా ఛీఫ్ అమీత్షా స్వయంగా రంగంలోకి దిగుతున్నారు.
మ్యాజిక్ ఫిగర్ 112కు కేవలం 8 సీట్ల దూరంలో ఉన్న బీజేపీ… ప్రత్యర్థి జేడీఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో చీకలకు యత్నిస్తున్నట్లు సమాచారం. ఆ మేరకు అవసరమైన వ్యూహరచనతోపాటు అమలును కూడా స్వయంగా పర్యవేక్షించేందుకే బీజేపీ చీఫ్ అమిత్ షా బెంగళూరుకు వస్తున్నట్లు తెలుస్తోంది. మరో సారి కర్నాటకలో కూడా ఆపరేషన్ కమల’ను మరోసారి చేయాలని భాజపా చూస్తోంది.