Friday, May 3, 2024
- Advertisement -

భూమా అఖిల‌ప్రియ‌కుటుంబంలో లుక‌లుక‌లు … షాక్ ఇచ్చిన సోదురుడు

- Advertisement -

సొంత ఇల‌కాలో భూమా అఖిల ప్రియ‌కు బిగ్ షాక్ త‌గిలింది. కుటుంభ స‌భ్యులు ఒక్కొక్క‌రే పార్టీని వీడుతున్నారు. దివంగ‌త‌నేత భూమా నాగిరెడ్డి స్నేహితుడైన ఏవీ సుబ్బారెడ్డి ఇప్ప‌టికే దూర‌మ‌య్యారు. తాజాగా భూమా సోద‌రుడు భాజాపాలో చేరారు. భాజాపా అప‌రేష‌న్ ఆక‌ర్ష్ లో భాగంగా కాషాయ కండువా క‌ప్పుకున్నారు.

దివంగత భూమా నాగిరెడ్డి అన్న కుమారుడైన కిశోర్ రెడ్డి కాషాయ గూటికి చేరారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేడీ నడ్డా సమక్షంలో కర్నూలులో జరిగిన కార్యక్రమంలో వీరు బీజేపీలో చేరారు. వీరికి కండువా కప్పిన జేడీ నడ్డా సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆళ్లగడ్డలో భూమా వర్గాన్ని కాపాడుకునేందుకే బీజేపీలో చేరినట్లు ప్రకటించారు. కాగా, ఇప్పటికే టీడీపీ ని నలుగురు రాజ్యసభ సభ్యులు సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్, గరికపాటి, సుజనాచౌదరి బీజేపీ తీర్థం పుచ్చుకున్న సంగ‌తి తెలిసిందే. రాష్ట్రంలో వైసీపీకి సరైన ప్రత్యామ్నాయం బీజేపీయేనని 2024 నాటికి ఏపీలో కాషాయ జెండా ఎగరవేయడమే తమ లక్ష్యమని కిశోర్ రెడ్డి పేర్కొన్నారు. తాను ఎలాంటి పదవులు ఆశించి బీజేపీలోకి చేరలేదన్నారు.

భూమా అఖిల ప్రియ ఎన్నిక‌ల్లో ఓట‌మి నుండి బుటుంబంలో బేదాభ్రి ప్రాయాలు మొద‌లైన‌ట్లు స‌మాచారం. ప్ర‌ధానంగా అఖిల భ‌ర్త పెత్త‌న ఎక్కువ అవ‌డంతో భూమా సోదరుల్లో వ్యతిరేకత వ్యక్తమయ్యిందట. భూమా నాగిరెడ్డి సోదరుడు భాస్కర్‌రెడ్డి కుమారుడైన మాజీ ఎంపీపీ కిషోర్‌రెడ్డి కొద్ది రోజులుగా అఖిలప్రియపై అసంతృప్తితో ఉన్నారు. ఇదే స‌మ‌యంలో భాజాపా నేత‌లు ఆయ‌న‌తో ట‌చ్‌లోకి వెల్లారు. చివరికి బీజేపీలో చేరారు. . దీంతో ఆళ్లగడ్డ నియోజకవర్గంలో టీడీపీకి గట్టి షాక్ తగిలిందని స్థానిక నేతలు చర్చించుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -