ఏవీ సుబ్బారెడ్డి, భూమా కుటుంబం మధ్యనున్న సంబంధాలపై మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే రెండు కుటుంబాల మధ్య ఉన్న సంబంధాలు పూర్తిగిగా తెగిపోయనట్లే . నాపై ఎప్పుడైతే అఖిల రాళ్లదాడి చేయించిందో అప్పుడే అ కుంటుంబంతో సంబంధాలు తెగిపోయాయని ఏవీ చేసిన వ్యాఖ్యలకు భూమా మౌనికా రెడ్డి ఘాటు కౌంటర్ ఇచ్చారు.
టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై ఇటీవల రాళ్లదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయంపై అఖిలప్రియపై కొందరు విమర్శలు చేస్తున్నారని ఆమె సోదరి భూమా మౌనిక అన్నారు. ఈ రోజు తమ కుటుంబ సభ్యులమంతా విజయవాడకు వచ్చామని తెలిపారు. ఏవీ సుబ్బారెడ్డితో చెలరేగిన గొడవపై సీఎం చంద్రబాబు చర్చిస్తున్నారని చెప్పారు.
“మా అక్కపై వేలెత్తి విమర్శలు చేస్తే భూమా కుటుంబ సభ్యులు అందరూ తగిన బుద్ధి చెబుతారని నేను నమ్ముతున్నానన్నారు. మా తల్లిదండ్రులు రాష్ట్రానికి ఎన్నో సేవలు చేశారని, ఏవీ సుబ్బారెడ్డి కుటుంబం మాపై చాలా వ్యతిరేకత చూపించడం సరికాదన్నారు. భూమా కుటుంబంతో సంబంధాలు తెగిపోయాయని ఏవీ చెప్పారని.. కాబట్టి మేము అక్క వెనుకాల ఉన్నాము.అక్కను వేలెత్తి చూపిస్తే భూమా క్యాడర్ని మొత్తం వేలెత్తి చూపెట్టినట్లేనన్నారు.
మా అక్కను ఎవరైనా ఏదైనా చేయాలనుంకుంటే మేము, భామా క్యాడర్ను దాటి వెల్లాలని హెచ్చరించారు. రాజకీయంగా ఎదగడానికే ఏవీ మాపై కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు మౌనిక. ఇప్పుడు కొత్తగా మీడియా ముందుకు వచ్చి భూమా కుటుంబంతో సంబంధం తెగిపోయిందని అంటున్నారు. ఏనాడో తెంచుకున్నావు.. నీ గురించి ఎంత మాట్లాడినా తక్కువే అని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజకీయంగా ఎదగాలంటే మేము కూడా సహకరిస్తాం. భూమా కుటుంబాన్ని వేలెత్తి చూపిస్తే నంద్యాల, ఆళ్లగడ్డ ప్రజలు ఊరుకోరు. మాపై పోలీస్ కేసు పెట్టారు.. విచారణకు సహకరిస్తామన్నారు. అక్కను వేలెత్తి చూపుతో మొత్తం భూమా క్యాడర్ను వేలెత్తి చూపినట్లేనన్నారు. మరో సారి కుట్ర రాజకీయాలు చేస్తే చూస్తూ ఊరుకోమని ఏవీ సుబ్బారెడ్డికి వార్నింగ్ ఇచ్చింది భూమా మౌనిక. చంద్రబాబు దగ్గర పంచాయితీ పూర్తిఅయిన తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.