Monday, April 29, 2024
- Advertisement -

చంద్ర‌బాబుకు కోవ‌ర్టుల భ‌యం…

- Advertisement -

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడికి ఇప్పుడు కొత్త భ‌యం ప‌ట్టుకుంది.ఇన్నాల్లు వైసీపీనుంచి స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్న సీఎంకి ఇంటి దొంగ‌ల‌తో త‌ల‌నొప్పిగా మారింది.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భవిష్యత్తులో తీసుకోవాల్సిన నిర్ణయానికి సంబంధించిన అంశంపై పార్టీ సీనియర్లతో చర్చించారు.పార్టీ ముఖ్య నాయకులతో చేసిన చర్చల సారాంశం వైసీపీ చీఫ్‌కు ఎలా చేరిందనే విషయమే ప్రస్తుతం తీవ్ర టీడీపీలో చర్చనీయాంశమైంది.భ‌విష్య‌త్తులో అమ‌లు చేయాల్సి ప‌థ‌కాల‌ను ముందుగానే జ‌గ‌న్ త‌న మేనిఫెస్టోను ప్ర‌క‌టించారా అనేది సందిగ్దంగా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.200లుగా ఉన్న పెన్షన్‌ను వెయ్యిరూపాయాలకు పెంచుతూ నిర్ణయం తీసుకొంది.వికలాంగులకు నెలకు రూ.1500 చొప్పున పెన్షన్‌లు చెల్లిస్తున్నారు. పెన్షన్ మొత్తాన్ని రెండువేలకు పెంచితే ఎలా ఉంటుందనే విషయమై పార్టీ సీనియర్‌లతో బాబు చర్చించారు.

గుంటూరు వేదికగా నిర్వహించిన వైసీపీ ప్లీనరీలో పెన్షన్‌ను రూ.2వేలు చెల్లించనున్నట్టు వైసీపీ చీఫ్ జగన్ ప్రకటించారు. అయితే తాము ప్రకటించాలనుకొన్న పథకాన్ని జగన్ ప్రకటించేసరికి టిడిపి నేతలు విస్తుపోయారు. చంద్రబాబుతో జరిగిన చర్చల సారాంశం జగన్‌కు ఎలా లీకైందనే విషయమై పెద్ద చర్చసాగుతోంది.అయితే లీకువీరులెవరనే విషయమై పార్టీవర్గాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

టిడిపి నేతలు కొందరు మాత్రం ఈ విషయం లీకైందనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ఈ విషయం లీకైతే మాత్రం పార్టీకి చిక్కులు తప్పవు. లీక్ వీరులను గుర్తించకపోతే రానున్న రోజుల్లో పార్టీ మరిన్ని ఇబ్బందులను ఎదుర్కొవాల్సి ఉంటుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -