ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెర కెక్కనున్న సినిమా ఇంకా సెట్స్ మీదకు వెల్లకు ముందే రాష్ట్రంలో ప్రకంపనలు రేపింది. ఈ సినిమా దర్శకుడు రాంగోపాల్ వర్మపై టీడీపీ నాయకులు విరుచుకు పడిన సంగతి తెలిసిందే. ఇప్పటికె దీనిపై దుమారం రేగింది.
ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలో ప్రముఖంగా వెన్నుపోటు రాజకీయ సంఘటనె వివాదాలకు దారితీస్తోంది. ఉన్నది ఉన్నట్లుగా రామారావుకు జరిగిన వెన్నుపోటు ఘటన గురించె ప్రధానంగా చిత్రీక రిస్తానని వర్మ ప్రకటించారు. ఇప్పటికె దీనికి సంబంధించి ఇమేజ్ను రిలీజ్ చేశారు. అవన్నీ పక్కన పెడితె తాజాగా ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి సినిమాపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఎన్టీఆర్ జీవితం తెరిచిన పుస్తకమని, ఆయనకు సంబంధించిన అన్ని విషయాలు అందరికీ తెలుసునని, సినిమా తీస్తే ఆయన గౌరవాన్ని పెంచేలా ఉండాలి గానీ ఒక్క కోణంలో సినిమా తీయాలనుకోవడం సబబు కాదని పురంధేశ్వరి అన్నారు. ఎన్టీఆర్ జీవితం ఆధారంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీయనున్న `లక్ష్మీస్ ఎన్టీఆర్` సినిమాపై ఆమె స్పందించారు.
ఆంధ్రులకు ఆత్మగౌరవం అంటే ఏంటో అర్థం చెప్పిన వ్యక్తి నందమూరి తారకరామారావు అని గతంలో రామ్ గోపాల్ వర్మ అన్న మాటలను ఆమె గుర్తు చేశారు. అలాంటి మహానీయుడిని బజారుకీడ్చొద్దని ఆమె హితవు పలికారు.`ఒకవేళ సినిమా తీయాలనుకుంటే, నిర్మాణాత్మకంగా ఎన్టీఆర్ జీవితంలో జరిగిన అన్ని విషయాలను చూపించే ప్రయత్నం చేయాలి తప్ప ఇలా ఏక కోణంలో సినిమా నిర్మించాలనుకోవడం సరికాదు` అని పురంధేశ్వరి అన్నారు. వీరందరి విన్నపాటు వర్మ స్వీకరిస్తారా లేక తను అనుకన్న విధంగా సినిమా తీస్తారా అన్నది సినిమా విడుదల అయితె గాని తెలియదు.