Wednesday, May 15, 2024
- Advertisement -

అధిష్టానం పై గుర్రుగా ఉన్న సోము వీర్రాజు… వైసీపీ వైపు అడుగులు వెయనున్నారా..?

- Advertisement -

భాజాపా నుంచి మ‌రో వికెట్ ప‌డ‌నుందా…? ఆ పార్టీనుంచి ప్ర‌స్తుత ఎమ్మెల్సీ వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారా..? చూస్తుంటే ప‌రిస్థితులు అలానే ఉన్నాయి. జ‌గ‌న్ పాద‌యాత్ర 2000 కి.మీ మైలురాయిని చేరుకోన్నుంది. పాద‌యాత్ర‌లో జ‌గ‌న్‌కు వ‌స్తున్న స్పంద‌న‌చూస్తే వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ అదికారంలోకి వ‌స్తార‌ని అనేక స‌ర్వేలు చెప్తుండంతో టీడీపీ, భాజాపా నుంచి వ‌ల‌స‌లు ఊపందుకున్నాయి.

తాజాగా భాజాపా ఎమ్మెల్సీ సోము వీర్రాజు వైసీపీ కండువా కప్పుకొనేందుకు సిద్ద‌మ‌య్యార‌నే వార్త‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి. భాజాపా అధ్య‌క్ష ప‌ద‌విపై ఆశ‌లు పెట్టుకున్న సోమ‌కు నిరాశే ఎదురయ్యింది. పార్టీ అధిష్టానం క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌ను నియ‌మించ‌డంతో ఆయ‌న అజ్ణాతంలోకి వెల్లారు.

మ‌రో వైపు క‌న్నాకు బాధ్యతలు ఇవ్వడంపై ఎమ్మెల్సీ సోము వీర్రాజు వర్గం ఆగ్రహంతో ఉంది. కన్నాకు పార్టీ చీఫ్ పదవి ఇవ్వడంతో సోము వీర్రాజు కినుకు వహించారు. ఎవరికీ అందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన‌ట్లు తెలుస్తోంది. పార్టీ మారే వ్యక్తికి పదవులు ఇవ్వడం ఏమిటని అసంతృప్తితో ఉన్నారు.కాగా, కన్నా లక్మీనారాయణ ఇటీవల వైసీపీలోకి వెళ్తారనే ప్రచారం సాగుతోంది.

పార్టీ చీఫ్ పదవి తనకు వస్తుందని సోము వీర్రాజు చాలా కాలంగా వేచిచూస్తున్న రాక‌పోవ‌డంతో వైసీపీలోకి వెళ్లాలని అనుకున్న‌ట్లు స‌మ‌చారం. మ‌రి కొన్ని రోజుల్లో త‌మ నాయ‌కులు,కార్య‌క‌ర్త‌లో క‌ల‌సి భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టించే అక‌వాశం ఉందనే వార్త‌లు రాజ‌కీయా వ‌ర్గాల్లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. అజ్ణాతంలో ఉన్న సోము బ‌య‌ట‌కు వ‌చ్చి స్పందిస్తేగాని క్లారిటీ వ‌చ్చే అవ‌కాశంలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -