భాజాపా ఆపరేషన్ ఆకర్శక్ చంద్రబాబు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. పార్టీనుంచి కీలక నేతలు భాజాపాలో చేరుతున్నా అడ్డుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. బాబుకు అన్ని విషయాల్లో నమ్మిన బంట్లుగా ఉన్న వాల్లే నట్టేట ముంచుతున్నారు. నలుగురు రాజ్యసభులు కాషాయ కండువా కప్పుకున్నారు. వారిలో ఒక నేత టీడీపీనీ ఖాలీ చేయించే పనిలో నిమగ్నమయ్యారు.
గ్రామ సర్పంచ్గా కూడా గెలవలేని వాల్లను పార్టీలో అందలం ఎక్కిచారు చంద్రబాబు. సంవత్సరాల పాటు టిడిపిలో అన్నీ విధాలుగా అపరిమితమైన అధికారాలను అనుభవించి రెండుసార్లు రాజ్యసభ ఎంపిగా అయి కేంద్రమంత్రిగా కూడా పనిచేసిన సుజనా చౌదరే ఇపుడు టిడిపిని దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు.
బిజెపిలోకి ఫిరాయించిన తన సన్నిహితుడే టిడిపి నేతలను లాక్కునేందుకు వ్యూహాలు పన్నుతుంటే ఏం చేయలేక చంద్రబాబునాయుడు నానా అవస్తలు పడుతున్నారు. వార్డు కౌన్సిలర్గా కూడా గెలవలేని వాళ్లను పార్టీలో చేర్చుకొని అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు.రెండుసార్లు రాజ్యసభ ఎంపిగా ఉండి వందలకోట్లు సంపాదించుకొన్నారు. పదవిని అడ్డుపెట్టుకొని బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి పంగనామం పెట్టిన సంగతి తెలిసిందే.
ఇటీవలె సుజనా భాజాపాలో చేరిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ కమలం ఆకర్ష్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని టిడిపి నేతలతో తనకున్న సన్నిహిత సంబంధాలను అడ్డం పెట్టుకుని వారిని బిజెపిలోకి వచ్చేట్లు ప్రయత్నాలు మొదలుపెట్టారు. తాజాగా సుజనాకు సన్నిహితుడైన బాపట్లకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ పదవులకు రాజీనామా చేసి శుక్రవారం బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. అన్నం సతీష్ కు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఆపరేషన్ కమలంలో సుజనాతో పాటు కేంద్ర హోంమంత్రి కిషన్ రెడ్డి కీలక పాత్రపోషిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇతర పార్టీల్లోని బలమైన నేతలను పార్టీలోకి లాక్కుంటున్నారు. అసలు కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి ఇచ్చింది ప్రజలకు సేవ చేసేందుకా అర్థిక నేరగాళ్లందర్ని పార్టీలో చేర్చుకనేందుకా….?