Sunday, May 5, 2024
- Advertisement -

చెప్పులు మోస్తే కనికరించేది ప్రజలా.. పార్టీ పెద్దలా ?

- Advertisement -

పదవుల కోసం రాజకీయ నాయకులు ఏ పనైనా చేస్తారు అనేది అందరికీ తెలిసిందే. కొన్ని సార్లు వారి చేసే పనులు సామాన్యుడికి సైతం చికాగు పుట్టిస్తుంటాయి. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇంటింటికి వెళ్ళి చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ కళ్ళు మొక్కడం, పురుషులు మహిళలు అనే తేడా లేకుండా వారిపై ముద్దుల వర్షం కురిపించడం. చిన్న పిల్లలకు ముడ్డి కడగడం.. వామ్మో ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే చెప్పాల్సి వస్తుంది. ఇలా అనవసర పనులు చేసినంత మాత్రాన ప్రజలు ఓట్లు వేస్తారా ? అంటే చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే నేటి రాజకీయాలపై ప్రజలు పూర్తి అవగాహనతో ఉన్నారు. అందువల్ల చంటోడి ముడ్డి కడిగినంత మాత్రనో లేదా ముసలివాళ్ళకు ముద్దులు పెట్టినంత మాత్రనో ఓట్లు వేసే పరిస్థితి లో ప్రజలు లేరన్నది జగమెరిగిన సత్యం. అయినప్పటికి రాజకీయ నాయకులు మాత్రం ఇలాంటి చేయడం ఆపడం లేదు..

సరే ఈ విషయాలన్నీ అలా ఉంచితే.. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఇటీవల చేసిన ఓ పని రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయింది. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఇటీవల తెలంగాణ వచ్చిన కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న తరువాత బయటకు వస్తున్నప్పుడు.. బండి సంజయ్ హుటాహుటిన వెళ్ళి అమిత్ షా చెప్పులను చేత్తో పట్టుకొని తెచ్చి ఆయన కాళ్ళ ముందు ఉంచారు. రాష్ట్రంలో అధ్యక్ష హోదాలో ఉన్న బండి సంజయ్ ఇలా వ్యవహరించడం ఏంటనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. పదవి కోసం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కేంద్రం కాళ్ళ దగ్గర ఉంచుతారా ? అంటూ సామాన్యులు సైతం ప్రశ్నిస్తున్నారు.

బీజేపీ పెద్దల చెప్పులు మోస్తే.. పార్టీ పెద్దలు కనికరిస్తారేమో గాని, ప్రజలు కాదు అంటూ విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇక బండి సంజయ్ వ్యవహార శైలిపై మంత్రి కే‌టి‌ఆర్ వ్యంగ్యస్త్రాలు సంధించారు. బండి సంజయ్ చేస్తోన్న ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జే‌సి నడ్డా హాజరు కానున్నారు. ” ఇప్పుడు జే‌సి నడ్డా చెప్పులు మోసే గులాం ఎవరో మరి ” అంటూ ట్విట్టర్ లో మంత్రి కే‌టి‌ఆర్ తెలంగాణ బీజేపీ నాయకులపై వ్యంగ్యస్త్రాలు సంధించారు. ఏది ఏమైనప్పటికి పదవులు ఇచ్చే పార్టీ పెద్దల చెప్పులు మోస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని బండి సంజయ్ బీజేపీ పెద్దల కాళ్ళ దగ్గర పెట్టడాని సామాన్యులు సైతం ఈసడించుకునే పరిస్థితి ఏర్పడింది.

Also Read

ప్రజలను ఏమార్చే కుట్ర చేస్తోన్న మోడీ !

కే‌సి‌ఆర్ భయపడుతున్నారా.. భయపెడుతున్నారా ?

ఓటర్ల కాళ్ళు మొక్కితే ఓట్లు వేస్తారా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -