గ్రేటర్ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో నేతల మాటలు తూటాల్లా పేలుతున్నాయి. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై పోలీసులు శనివారం కేసులు నమోదు చేశారు. గ్రేటర్ ప్రచారంలో భాగంగా వీరిద్దరూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు పోలీసులు సుమోటాగా కేసులు నమోదు చేశారు.
బండి సంజయ్, అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలతో సామాజికంగా ఘర్షణలు చెలరేగే అవకాశాలున్నాయని ఎఫ్ఐఆర్లో పోలీసులు పేర్కొన్నారు. ఎర్రగడ్డ డివిజన్లో ప్రచారం నిర్వహించిన బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై ఐపీసీ 505 కింద కేసు ఎస్సార్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇక ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఎన్టీఆర్, పీవీ సమాధులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దానికి ప్రతిదాడిగా పీవీ, ఎన్టీఆర్ ఘాట్లను కూలిస్తే… రెండు గంటల్లోగా దారుసలాంను కూల్చేస్తామని ఛాలెంజ్ విసిరారు. ఈ నేపథ్యంలో నగరంలో మత ఘర్షణలకు తావు ఏర్పడుతుందని అందుకే కేసులు నమోదు చేశామని పోలీసులు పేర్కొన్నారు.
మమతా బెనర్జీ కి షాక్.. సీనియర్ నేత రాజీనామా..!
తిరుపతి ఉప ఎన్నికల్లో గెలుపు ఎవరిది..?