Sunday, April 28, 2024
- Advertisement -

చంద్రబాబు..మహాదోపిడీ

- Advertisement -

అధికారం కోసం ఎంతకైన దిగజారే వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. విజయవాడలో అధికార భాష సంఘం అధ్యక్షుడు విజయబాబు రాసిన మహాదోపిడీ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..చంద్రబాబు అవినీతిని వ్యవస్థీకృతం చేశారన్నారు.

ఏపీకి అంతర్జాతీయ స్థాయిలో చంద్రబాబు చెడ్డపేరు తెచ్చారని మండిపడ్డారు. దేశానికి అవినీతిని పరిచయం చేసిందే చంద్రబాబు అని …చంద్రబాబు అధికారం కోసం పవన్‌, బీజేపీని వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. రాజకీయం అంటే దోపిడీ అన్నట్టుగా చంద్రబాబు వ్యవహరించారని.. జన్మభూమి కమిటీల పేరుతో అడ్డగోలుగా దోచుకున్నారన్నారు.

షర్మిల వెనుక ఉంది చంద్రబాబేనని..ఆమె వాడే భాషను ప్రజలు గమనిస్తున్నారన్నారు. నెగటివ్ శక్తులన్నీ కలిస్తే అది చంద్రబాబేనని, రాష్ట్రాన్ని అప్పడంలా నమిలి మింగేయడానికి చంద్రబాబు అన్ని ప్రయత్నాలు చేస్తాడని ఆరోపించారు. ఐఎంజీ భారత్ పేరుతో చంద్రబాబు చేసింది ఇంటర్నేషనల్ క్లాసిక్ స్కాం అని దుయ్యబట్టారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -