Thursday, April 25, 2024
- Advertisement -

ఏపి అసెంబ్లీలో సీఎం జగన్ ప్లే చేసిన వీడియోకి పడీ పడీ నవ్వారు!

- Advertisement -

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మూడోరోజు హాట్‌హాట్‌గా జరిగాయి. పోలవరంపై అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పోలవరంపై సీఎం జగన్ మాట్లాడుతున్న సమయంలో టీడీపీ నేతలు పదేపదే అడ్డుపడిన సమయంలో జగన్ చేసిన పనికి అందరూ పగలబడి నవ్వారు.

టీడీపీ అధినేత చంద్రబాబు భజనకు సంబంధించిన ఓ వీడియో ప్లే చేసి అందరినీ నవ్వించారు. ప్రజలకు పోలవరాన్ని చూపించడానికే 83 కోట్ల 43 లక్షలు ఖర్చు చేశారని టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. అధికారం అడ్డు పెట్టుకొని ఆయన ప్రజలకు లేని పోని ఆశలు చూపించారని.. ఆయన భజనకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చుకున్నారని అన్నారు.

మహిళలను పోలవరానికి తీసుకెళ్లి ఏం చేయించారో మీరే చూడండంటూ వీడియో ప్లే చేయించారు. జయము జయము చంద్రన్నా అంటూ కొందరు మహిళలు చేసిన భజన వీడియోతో సభలో స్పీకర్ తో సహా ఒక్కసారిగా నవ్వుల జల్లులు కురిశాయి.

Also Read

అందుకే రంగమ్మత్త పాత్ర వదులుకున్నాను : రాశి

పూరి జగన్నాథ్ పరిచయం చేసిన హీరోయిన్లు వీళ్ళే..!

టాలీవుడ్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ ఇవే..!

టాలీవుడ్ స్టార్ హీరోలు రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -