టీడీపీ భవిష్యత్తు.. భావీ నేత నారా లోకేష్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఇప్పుడు కౌన్ బనేగా కరోడ్పతిలో చివరి ప్రశ్నగా మారింది. అసలు ఆయన పోటీ చేస్తారా? అనే ప్రశ్న కూడా అక్కడక్కడా ఎదురవుతోంది? కానీ ఆయన పోటీ చేయక తప్పదు. ఎందుకంటే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకపోతే పరువు పోయే పరిస్థితి. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న లోకేష్కు సీటు అవసరం పడింది. గత కొన్ని రోజులుగా తాను పోటీ చేసే సీటు కోసం లోకేష్ తీవ్రంగా వెతుకుతున్నారు. సీటు కాఆవాలంటే దొరుకుతోంది. కానీ పోటీ చేస్తే తప్పక గెలిచే సీటు కావాలి.
గత కొన్నాళ్లుగా చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పం నియోజకవర్గం నుంచి లోకేష్ పోటీ చేస్తారని టీడీపీ నేతలు లీకులు ఇచ్చారు. నారావారికి కలిసివచ్చిన కుప్పం నుంచి లోకేష్ బరిలో ఉంటారని ప్రచారం చేశారు. అయితే ఇప్పుడు ఆ సీటును వదులుకునేందుకు చంద్రబాబు ఇష్టపడడం లేదని తెలుస్తోంది. తనయుడి కోసం తన సీటు ఆయన త్యాగం చేసే పరిస్థితి కనిపించడం లేదు. కుప్పం నుంచే మళ్లీ చంద్రబాబు పోటీ చేయబోతున్నారనే క్లారిటీ మాత్రం ఇచ్చారు.
మరి నారా లోకేష్ ఎక్కడి నుంచి పోటీచేస్తారు అంటే కృష్ణాజిల్లా పెనమలూరు నుంచి పోటీ చేస్తారని ఒకసారి లీకులు ఇస్తే… తిరుపతి నుంచి పోటీ చేస్తారని మరొకసారి చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడేమో ఉత్తరాంధ్ర వైపు ఆయన చూస్తున్నారని మీడియాలో కథనాలను బట్టి తెలుస్తోంది.
మంత్రి గంటా శ్రీనివాసరావు గత ఎన్నికల్లో గెలిచిన భీమిలి నుంచి లోకేష్ పోటీ చేస్తారని వార్తలు విన్పిస్తున్నాయి. భీమిలి సీటు లోకేష్కు ఇచ్చి గంటా విశాఖ నార్త్ నుంచి బరిలో ఉంటారని సమాచారం.