Saturday, April 20, 2024
- Advertisement -

ఎంత కష్టపడినా.. కొందరు పనికట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారు : సీఎం జగన్

- Advertisement -

నేడు ఏపీ సీఎం జగన్ ‘స్పందన’పై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా కష్టకాలంలో పార్టీ నేతలు, అధికారులు ప్రతి ఒక్కరూ తమ వంతు కష్ట పడుతున్నారని.. ఎంత శ్రమిస్తున్నా కొన్ని పరిస్థితులు మన చేతుల్లో ఉండవు అని అన్నారు సీఎం జగన్. ఈ సందర్భంగా ఆయన తిరుపతి రుయా ఆసుపత్రి ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఆక్సిజన్ లభ్యత లేక 11 మంది చనిపోవడంపై వివరణ ఇస్తూ, కొవిడ్ కట్టడి, ఆక్సిజన్ సరఫరా, వ్యాక్సిన్ అందజేత వంటి అంశాలపై తీవ్రంగా శ్రమిస్తున్నామని చెప్పారు. కొన్ని సార్లు ప్రయాణాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని.. తమిళనాడు నుంచి ఆక్సిజన్ ట్యాంకర్ సరైన సమయానికి రాకపోవడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుందని వివరించారు. కొవిడ్ తో కలిసి జీవించాల్సిన పరిస్థితుల్లో ఉన్నామని, ఈ నేపథ్యంలో కొన్ని బాధాకరమైన ఘటనలు జరుగుతున్నాయని తెలిపారు.

ఇవాళ ఆక్సిజన్ కొరత కనిపిస్తోంది. నిన్న కూడా ఆరు ఖాళీ ట్యాంకర్లను ఒడిశా పంపి అక్కడ్నించి ఆక్సిజన్ నింపుకుని వెనక్కి తీసుకువస్తున్నాం. విదేశాల నుంచి కూడా ఆక్సిజన్ ను కొనుగోలు చేసి నౌకల ద్వారా తెప్పిస్తున్నాం అని వివరణ ఇచ్చారు. ఇక వ్యాక్సిన్ల పరిస్థితిపై రాష్ట్రంలోనే కాదు దేశంలోని ప్రతి ఒక్కరికీ తెలుసని అన్నారు. డబ్బులు తీసుకుని వ్యాక్సిన్లు సరఫరా చేయాలని కోరినా కంపెనీలు తీసుకోవట్లేదని వెల్లడించారు.

లైవ్ లో ఆ విషయాలను చెప్పేసిన అభిజీత్..?

ప్రశాంతత కోసం ఆ పని చేయండంటున్న బాలీవుడ్ బ్యూటీ!

రాజ్ తరుణ్ ‘స్టాండప్ రాహుల్’ పోస్టర్ రిలీజ్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -