Friday, April 26, 2024
- Advertisement -

విద్యాశాఖపై సీఎం సమీక్ష

- Advertisement -

ఏపీలో కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ జరిగిన తర్వాత తొలిసారిగా విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. అయితే ఈ సమావేశంలో ఆ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొనకపోవడం చర్చనీయాంశమైంది. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ తర్వాత ఈ శాఖను ఆదిమూలపు సురేష్ నుంచి బొత్స సత్యనారాయణకు అప్పగించారు.

విద్యార్థుల పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లతో పాటు పలు అంశాలపై సీఎం ఈ సమీక్ష నిర్వహించారు. విద్యా శాఖ మంత్రిగా ఉన్న బొత్స హాజరుకాకపోవడంతో శాఖల కేటాయింపులపై ఆయన అసంతృప్తిగా ఉన్నారా అంటూ కొందరు చర్చించుకున్నారు. అయితే తన గైర్హాజరుపై బొత్స ముందుగానే సీఎం కార్యాలయానికి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.

తన సోదరుడి కుమార్తె వివాహ ఏర్పాట్లలో క్షణం తీరక లేకుండా ఉండటంతో తాను సమీక్షకు హాజరు కాలేకపోతున్నట్లు బొత్స తెలిపినట్లు సమచారం.

పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ కాదు.. అనిల్ కుమార్

రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -