Thursday, April 25, 2024
- Advertisement -

పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ కాదు.. అనిల్ కుమార్

- Advertisement -

పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ కాదు బిచ్చం నాయక్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు తాజా మాజీ మంత్రి అనిల్ కుమార్. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన అనిల్ ఈ వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవులు పోయినందుకు తమకు బాధగా లేదన్నారు. రెండున్నరేళ్లు తనకు మంచి శాఖ ఇచ్చారన్నారు. జగన్ కు తాము సైనికుల్లా పని చేసి.. పార్టీని తిరిగి అధికారంలోకి తెస్తామన్నారు. అప్పుడు పాత వారమంతా మంత్రులు అవుతామన్నారు.

తాను మంత్రిగా ఉన్నప్పుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి చూపిన ప్రేమ, వాత్సల్యం, సహకారం ఇప్పుడు అంతకు రెండింతలు చూపిస్తానన్నారు. తనను ఎవరూ ఆహ్వానించక పోవడం వల్లే ప్రమాణస్వీకారానికి హాజరుకాలేదన్నారు. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ దగ్గర 35 సీట్లు, 40 సీట్లు అడ్డుకుని 2024 ఎన్నికల్లో పోటీ చేస్తాడన్నారు. ఇలాంటి వ్యక్తి సీఎం ఎలా అవుతాడన్నారు. అందుకే పవన్ కల్యాణ్ భీమ్లానాయక్ కాదనీ బిచ్చం నాయక్ అంటూ వ్యాఖ్యలు చేశారు.

పవన్ కల్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు తనని ట్రోల్ చేసినా తానేమీ వెనకాడబోనన్నారు. వచ్చే ఎన్నికల్లో 140 స్థానాల్లో జనసేన పోటీ చేస్తే అప్పుడు తన మాటలు వెనక్కి తీసుకుంటానన్నారు. గతంలో మంత్రిగా ఉన్నప్పుడు కాస్త ఆచీ తూచి మాట్లాడానని ఇప్పుడు డబుల్ ఫోర్స్ తో వెళతానన్నారు. ప్రతిపక్షాలపై విమర్శల విషయంలో తగ్గేదే లేదన్నారు.

ఆత్మకూరు వైసీపీ అభ్యర్థి ఖరారు

కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం

రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -