Saturday, April 20, 2024
- Advertisement -

కామ్రేడ్ బూర్గుల నర్సింగరావు కన్నుమూత..!

- Advertisement -

తెలంగాణ ఉద్యమ నేత బూర్గుల నర్సింగరావు కరోనాతో మృత్యువాత పడ్డారు. హైదరాబాద్​లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మరణించారు. బూర్గుల మృతి పట్ల మంత్రి కేటీఆర్​, సీపీఐ నేతలు నారాయణ, సురవరం సుధాకర్​రెడ్డి, సాంబశివరావు, అజీజ్​ పాషా, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​ రెడ్డి, డిప్యూటీ కార్యదర్శి పల్లా వెంకట్​రెడ్డి, పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు.

తెలంగాణ ఉద్యమంలో నర్సింగరావు సైనికుడిగా నిలబడ్డారని నారాయణ కొనియాడారు. కమ్యూనిస్టు ఉద్యమ పురోభివృద్ధిలో పెద్దదిక్కుగా ఉండేవారని గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటని వ్యాఖ్యానించారు. నర్సింగరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -