2019 ఎన్నికలు దగ్గర పడుతుండటంతో టీడీపీ తన మైండ్ గేమ్ను మొదలు పెట్టింది. నంద్యాల ఉప ఎన్నిక తర్వాత దాన్ని కాస్త జోరుపెంచింది. ఎన్నికల నాటికి వైసీపీ ఖాలీ అవుతుందని ప్రచారం మొదలు పెట్టారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి అధికార పార్టీలోకి వలసలు లేవు. టీడీపీ మైండ్ గేమ్కు చెక్ పెట్టేందుకు నవరత్నాల పథకాలను ఉపయేగించు కోవాలని నాయకులు పక్కా ప్లాన్ను సిద్ధం చేస్తున్నారు.
వచ్చే ఎలలో జగన్ చేపడుతున్న పాదయాత్ర ద్వారా నవరత్న పథకాలను ప్రజలల్లోకి బలంగా తీసుకెల్లాలని నాయకులు, కార్యకర్తలు సిద్ధమవుతున్నారు. పాదయాత్రలో వీలైనంత మంది బలమైన నాయకులను పార్టీలోకి చేర్చకొనేందుకు పాదయాత్రను ఉపయేగించుకోనున్నారు. అయితే ఇప్పుడ తాజాగా నరసాపురం మాజీ ఎంపీ వైసీపీలోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నారనె వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
నరసాపురం అంటానె గుర్తుకొచ్చే కనుమూరి బాపిరాజు. కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగారు. ఇప్పటికే రెండు సార్లు ఎంపీ ఎన్నియ్యారు. ఆయన గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆ పార్టీకి భవిష్యత్తు లేదనేది తేలిపోయింది. మరో సారి క్రియారాజకీయాల్లోకి వచ్చేందుకు మక్కువ చూపుతున్నారు. త్వరలోనె అనుచరులు, కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వైసీపీలోకి వస్తే పార్టీ మరింత బలోపేతం అవుతుందనడంలో సందేహంలేదు.