తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్న విజయశాంతికి తృటిలొ ప్రమాదం తప్పింది. పలువురు కాంగ్రెస్ నేతలతో కలిసి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అచ్చంపేటలో విజయశాంతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
వేదికపై కాంగ్రెస్ సీనియర్ నేతలు భట్టి విక్రమార్క, విజయశాంతి ఉండగా ఒక్కసారిగా స్టేజీ కుప్పకూలింది. అప్రమత్తమైన కాంగ్రెస్ నేతలు తృటిలో తప్పించుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. స్టేజ్ మీద ఉన్న నేతలకు ఎలాంటి ప్రమాదం జరగలేదు.
ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాలో ప్రచారాన్ని నిర్వహించిన ప్రచార కమిటీ మొదట కొల్లాపూర్ లో రోడ్ షో తో పాటు బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ప్రత్యేక హెలికాప్టర్ లో అచ్చంపేటకు చేరుకున్న నాయకులు కార్యకర్తలతో కలిసి ర్యాలీ చేపట్టారు. ఆ తర్వాత బహిరంగ సభ కోసం సెంట్రింగ్ కర్రలతో నిర్మించిన వేదికపైకి ఎక్కారు. ఈ సమయంలో నాయకులతో పాటు కార్యకర్తలు కూడా అధిక సంఖ్యలో వేదికపైకి ఎక్కారు.
అంతే కాకుండా స్టార్ క్యాంపెయినర్, సినీ నటి విజయ శాంతికి షేక్ హ్యండ్ ఇవ్వడానికి కార్యకర్తలు ఎగబడ్డారు. ఈ క్రమంలో విజయశాంతి కూడా స్టేజి పై కలియతిరుగుతూ వారికి అభివాదం చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలింది. వేధికతో పాటే విజయశాంతి కూడా కిందపడిపోయారు.