Thursday, May 16, 2024
- Advertisement -

గుత్తిలో రూ.4.28 కోట్లతో నిర్మాణం.. హరీష్ రావు ముచ్చట..!

- Advertisement -

విద్యారంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోందని రాష్ట్ర మంత్రి హరీశ్​ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్​ నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. నాగిల్ గిద్ద మండలం కరస్​ గుత్తిలో రూ.4.28 కోట్లతో నిర్మించిన బాలికల గురుకుల పాఠశాలను మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులతో మంత్రి ముచ్చటించారు. స్కూళ్లలో కల్పిస్తున్న సౌకర్యాలు, భోజన సదుపాయాలపై అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులను సరదాగా మంత్రి ప్రశ్నించారు.

నారాయణఖేడ్​ నియోజకవర్గంలో నాలుగు గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్​, ఎమ్మెల్యే భూపాల్​రెడ్డి, కలెక్టర్​ హనుమంతరావు, అధికారులు పాల్గొన్నారు.

కడుపుబ్బా నవ్విస్తున్న ‘జాతిరత్నాలు’

సింగరేణిలో చిరు ఆచార్య.. సినిమా లో కొత్త ట్విస్ట్..!

ఏపి లో రెండో యుద్ధానికి సామగ్రి సిద్ధం..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -