పంజాబ్ డిప్యూటీ సీఎంగా మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూను నియమించే అవకాశాలు ఉన్నాయి. ఆ రాష్ట్ర సీఎం అమరీంద్ సింగ్ ఈ అంశంలో ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. 2022లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. నవజ్యోత్ సింగ్ సిద్ధూకు డిప్యూటీ సీఎం పదవిని కట్టబెట్టాలని అమరీందర్ ఆలోచిస్తున్నారు. గత కొంత కాలంగా సీఎం అమరీంద్ సింగ్, సిద్దూ మధ్య విభేదాలు తార స్థాయికి చేరుకోవడంతో జూలై 2019 న కేబినెట్ నుంచి వైదొలిగారు.
ఆ తర్వాత ఆయనకు విద్యుత్ శాఖా మంత్రిగా బాధ్యతలు చేపట్టాలని సీఎం అమరీందర్ సింగ్ పలుమార్లు విజ్ఞప్తి కూడా చేశారు. కానీ సిద్దూ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. అంతే కాదు ఆ సమయంలో తనకు డిప్యూటీ సీఎం పదవి తో పాటు పీసీసీ పదవి కూడా కావాలని డిమాండ్ చేశారు.
పంజాబ్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు సిద్దూకు డిప్యూటీ సీఎం పోస్టు ఇవ్వాలని అమరీందర్ భావిస్తున్నట్లు కొన్ని వర్గాల ద్వారా స్పష్టమైంది. పంజాబ్ ఎన్నికల్లో సిద్దూ కీలక ప్రచారకర్తగా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి.
తాడిపత్రి ఛైర్మన్ రసవత్తరం.. రహస్య శిబిరంలో నేతలు…!