మానవ శరీరంలో ప్రతి అవయం ముఖ్యమే.. ఏ ఒక్క భాగం సరిగ్గా పనిచేయకపోయినా.. మనం అనారోగ్యాల పాలవ్వడం ఖాయం. అందుకే మన శరీర భాగాల్ని మంచిగా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. ముఖ్యంగా కిడ్నీలను. మన శరీరంలో అతి ముఖ్యమైన భాగాల్లో కిడ్నీలు కూడా ఒకటి. ఇవి మన బాడీలో ఉండే మలినాలను క్లీన్ చేస్తూ.. మనం ఆరోగ్యంగా ఉండటానికి ఎంతో మేలు చేస్తాయి.
ఈ కిడ్నీలు సరిగ్గా పనిచేసినప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. వన్స్ కిడ్నీలకు ఏదైనా సమస్య వస్తే మాత్రం మన శరీరంలో మలినాలు పేరుకుపోయి అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా కిడ్నీలల్లో రాళ్లు ఏర్పడి అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే కిడ్నీలల్లో రాళ్లు ఏర్పడకుండా ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్యులు తెలుపుతున్నారు.
ఆక్స్ లైట్ ఉన్న ఆహార పదార్థాలను తీసుకుంటే కిడ్నీలల్లో స్టోన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఆక్సలైట్ ను కలిగున్న బీట్ రూట్, బచ్చలికూర, చాక్లెట్స్, టీ వంటి వాటిని తినకూడదు. అలాగే మాంసాహారం కూడా తీసుకోకూడదు. దీంతో పాటుగా పాలకు కూడా దూరంగా ఉండాలి. ముఖ్యంగా చల్లటి పానియాలకు కూడా దూరంగా ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
బాగా చెమట పడుతుందా..? ఈ చిట్కాలను ట్రై చేయండి..!
నాగార్జునకు కాజల్ గ్రీన్సిగ్నల్ !