ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ వైసీపీ జోరు కొనసాగిస్తోంది. జోరు అంటే వలసల్లో దూసుకుపోతోంది. బాబుకు టైమ్ బాగాలేనట్లుంది. పార్టీలో మంచిపట్టున్న నాయకులు టీడీపీకీ షాక్ ఇస్తూ వైసీపీలో జాయిన్ అవుతున్నారు. తాజాగా బాబుకు మరో బిగ్ షాక్ తగిలింది. ఏపీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు సోదరుడు దేవినేని చంద్రశేఖర్ టీడీపీకి గుడ్ బై చెప్పేశారు.
వసంత కృష్ణప్రసాద్తో కలిసి దేవినేని చంద్రశేఖర్ లోటస్పాండ్లో వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. పార్టీ కండువా కప్పి చంద్రశేఖర్ను వైఎస్సార్సీపీలోకి ఆహ్వనించారు. సినీనటుడు అలీకి వైసీపీ కండువా కప్పిన అనంతరం జగన్.. చంద్రశేఖర్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జగన్ సమక్షంలో చంద్రశేఖర్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
పార్టీలో చేరిన అనంతరం టీడీపీపై ఘాటు విమర్శలు చేశారు. టీడీపీలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని అన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో భారీ ఎత్తున దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. మైలవరం నియోజవర్గంలో వైసీపీని భారీ మెజార్టీతో గెలిపిస్తామని చంద్రశేఖర్ తెలిపారు. రామణుడి లంక నుండి విభీష్ముడు బయటకు వచ్చినట్లు దేవినేని ఉమ నుండి దేవినేని చంద్రశేఖర్ బయటకు వచ్చారని వసంత కృష్ణప్రసాద్ వ్యాఖ్యానించారు.
అధికారాన్ని అడ్డం పెట్టుకొని తనను రాజకీయంగా తొక్కేసేందుకు మంత్రి దేవినేని కంకనం కట్టుకున్నారన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఇంకా మంత్రి ఆగడాలు సాగవన్నారు. వైసీపీ నుంచి వసంత కృష్ణప్రసాద్, టీడీపీ నుంచి మంత్రి దేవినేని ఫిక్స్ కాబట్టి అన్నదమ్ముల మధ్య ఎన్నికల పోరు రసవత్తరంగా ఉండే అవకాశం ఉంది.