Sunday, May 19, 2024
- Advertisement -

భాజాపాలో చేర‌డంపై క్లారిటీ ఇచ్చిన సీబీఐ మాజీ జేడీ ..

- Advertisement -

సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ ఏ పార్టీలో చేరుతార‌నే ఉహాగానాలు ఊపందుకున్నాయి. గ‌తంలో జ‌న‌సేనలో చేరుతార‌నే వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. బీజేపీలో ఆయన చేరబోతున్నారని, 2019 ఎన్నికల్లో బీజేపీ ఏపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఆయనే అనే ప్రచారం ఓవైపు జరుగుతోంది.

అయితే ఈ వార్త‌ల‌పై క్లారిటీ ఇచ్చారు ల‌క్ష్మీనారాయ‌ణ‌. ఆ వార్తల్లో వాస్తవం లేదని చెప్పారు. జిల్లాల పర్యటన పూర్తయిన తర్వాత రాజకీయపరంగా ఓ నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. రైతులు సబ్సిడీలు, పథకాలను ఆశించడం లేదని… పంటలకు గిట్టుబాటు ధర ఇస్తే చాలంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి సమస్య పరిష్కారం కావాలని ఆకాంక్షించారు. ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతోనే ప్రజల్లోకి వచ్చానని చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -