Saturday, April 20, 2024
- Advertisement -

సీఎం జగన్ ను కలిసిన గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే

- Advertisement -

కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఈరోజు ఉదయం బీజేపీ ఎంపీ సుజనాచౌదరిని కలిసిన విషయం తెలిసిందే. అయితే ఇపుడు మరో ఆసక్తికర ఘటన కూడ ఈరోజు జరిగింది.

టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నానితో కలిసి ఏపీ సీఎం జగన్ ను కలిశారు. ఇదే విషయం ఇపుడు ఆంధ్రా రాజకీయలలో హాట్ టాపిక్ గా మారింది. దాదాపు అరగంట సమయం జగన్, వంశీ చర్చించుకున్నట్టు సమాచారం.

వల్లభనేని వంశీ పార్టీ మారతారన్న ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. టీడీపీ కార్యకర్తలు, తన అనుచరులతో వల్లభనేని వంశీ నిన్న భేటీ అయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్టు సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -