ఆ టీడీపీ యవ ఎమ్మెల్యే ఎవరికీ అర్థంకాడు. అంతా నాయిష్టం. ఆడంతె అదోటైపు సినిమాలాగా ఆయన కూడా అదంతె అదోటైపు. పార్టీకి బలంగా ఉండాల్సిందిపోయి…..బలహీనతగా మారుతుంటారు అదే ఆయన స్పెషల్. ఆ ఎమ్మెల్యేను రాజకీయంగా వాడుకోవడం, అవసరం తీరాక రాజకీయంగా ఆడుకోవడం అధికార పార్టీ టీడీపీ కి మామూలె.
యువ ఎమ్మేల్యే ఎవరో కాదు. ప్రస్తుతం గన్నవరం నియేజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న వల్లభనేని వంశీ. మరో సారి ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు. ప్రధానకారణం తన గన్మెన్ని ప్రభుత్వానికి సరెండర్ చేసేసి వార్తల్లోకెక్కడంతో ఇది హాట్ హాట్గా మారింది. చంద్రబాబు మీద తనకు విశ్వాసం తగ్గలేదట. అదెలా.? అదే మరి, వల్లభనేని వంశీ స్టయిలే వేరు.
ద్దరు గన్మెన్లను కోరుతూ ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు వల్లభనేని వంశీ. కారనం గతంలో వంశీకి, సీతారామాంజనేయులు అనే పోలీస్ ఉన్నతాధికారికీ మధ్య ‘విభేదాలు’ తెరపైకి వచ్చాయి. అప్పట్లో అది సంచలనంగా మారింది.
కాంగ్రెస్ హయాంలో నానా యాగీ చేసేశారు సదరు పోలీస్ ఉన్నతాధికారి గురించి వల్లభనేని వంశీ. టీడీపీ హయాంలో, ఎమ్మెల్యే అయ్యాక వల్లభనేని ఆ వివాదాన్ని మర్చిపోయారనుకున్నారంతా. కానీ, ఇప్పటికీ సదరు పోలీస్ ఉన్నతాధికారి నుంచి తనకు ప్రాణహాని వుందన్నది వల్లభనేని వంశీ మరో సారి ఆరోపణ చేశారు. కామెడీగా వుంది కదూ.. పోలీస్ ఉన్నతాధికారి నుంచి, అధికార పార్టీ నేతకి ‘థ్రెట్’ అంటే, పోలీస్ శాఖ ఎలా నమ్ముతుంది.
అసలు విషయం ఏంటంటె మొత్తం వ్యవహారాన్ని ఇంకా వల్లభనేని వంశీ, ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళలేదట. ఇది మరీ పెద్ద కామెడీ కదా.! గతంలో టీడీపీ మీద అలిగి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న వంశీ, ఆ తర్వాత మళ్ళీ టీడీపీలో సర్దుకుపోయారు. ఈసారి మళ్ళీ వంశీ, జగన్తో స్నేహం కోసం అడుగులేస్తున్నారనుకోవాలా.? అనేది ఇప్పుడు సస్పెన్స్గా ఉంది. ఆయన మనుసులో ఏముందో ఎవరికి ఎరుక.