వరస పరాజయాలతో ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి కష్టాలు మొదలయ్యాయి. బాబు మీద నమ్మకం లేకపోవడం పార్టీకి భవిష్యత్తు ఉండదనే కారణాలతో కీలక నాయకులు పార్టీని వీడుతున్నారు. మరో వైపు భాజాపా ఆపరేషన్ ఆకర్ష్ కు పార్టీ కుదేలవుతోంది. తాజాగా పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి గుమ్మడి కుతూహలమ్మ మరియు ఆమె కుమారుడు హరికృష్ణ పార్టీకి రాజీనామా చేశారు.
కాంగ్రెస్ నుంచి చిత్తూరు జిల్లా పరిషత్ అధ్యక్షురాలిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన డాక్టర్ కుతూహలమ్మ మొదటి సారి మొదటి సారి 1985లో వేపంజేరి నుంచి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యే గెలిచారు. ఆ తర్వాత వేపంజేరి నుంచే 1989, 1999, 2004, 2009లో ఎమ్మెల్యే గా గెలుపోందారు. అయితే 1994లో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. నేదురుమల్లి జనార్దన్రెడ్డి హయాంలో వైద్యారోగ్యం, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా, 2007లో డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు. రాష్ట్ర విభజనానంతరం 2014లో టీడీపీలో చేరారు.
టీడీపీ తమను ఎంతగానో గౌరవించిందని, అనారోగ్యం కారణంగా ప్రజల్లో తిరగలేకపోతున్నామని, పార్టీకి న్యాయం చేయలేకపోతున్నామని పార్టీ నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపారు. తమకు వేరే పార్టీలో చేరే ఉద్దేశం లేదని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు.