వైఎస్సార్ జిల్లా పులివెందులలో ఒక్క సారిగా రాజకీయం వేడెక్కింది. అధికార, ప్రతిపక్షపార్టీ మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సందు దొరికితే చాలు టీడీపీ నాయకులు వైఎస్ ప్యామిలీపై విమర్శలకు దిగడం చూశాం. తాజాగా పులవేందుల అభివృద్ధిపై వైఎస్ ఫ్యామిలీ చర్చకు రావాలని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ సతీష్రెడ్డి, వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగింది.
తాజాగా తెలుగుదేశం నాయకులు వైసీపీ నాయకత్వం పై అలాగే పులివెందులలో నాడు వైయస్ చేసిన అభివృద్దికి నేడు తెలుగుదేశం చేసిన అభివృద్ది చర్చకు సిద్దమా అని సవాల్ విసిరారు.. దానికి అవినాష్ రెడ్డి ప్రతిసవాల్ విసిరారు.. అయితే వైయస్ ఫ్యామిలీతో ఎప్పుడూ ఎన్నికల్లో ఓటమిపాలు అవుతున్న పులివెందుల తెలుగుదేశం నాయకుడు సతీష్ రెడ్డి సవాల్ పై స్పందించారు.
పులివెందులలో పూలంగల్ల కూడలిలో బహిరంగ చర్చకు ఈ నెల 4 వ తేదిన తాను సిద్దం అని అన్నారు.. దీనిపై ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి రెడీ అని సమాధానం ఇచ్చారు.. అప్పటి వరకూ కూడా అవసరం లేదు అని ఇప్పడు చర్చకు రమ్మన్నా వస్తాను అన్నారు.. మొత్తానికి ఇద్దరి సవాల్ పై రేపు పులివెందులలో చర్చజరుగుతుందా లేదా అన్నది అనుమానమే. చర్చ జరుగుతే ఎటువంటి సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులను మోహరించారు.