ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లాబీల్లో శుక్రవారం ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అసెంబ్లీ లాబీలో టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, బీజేపీ నేత సోము వీర్రాజు మధ్య అసక్తికర సంభాషన జరిగింది. ఈ సందర్భంగా బీజేపీలో చేరాలని బుద్ధా వెంకన్నను వీర్రాజు ఆహ్వానించారు. ఏపీలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రిని చేస్తామని సోము బంపర్ఆఫర్ ఇచ్చారు.
బీజేపీలో ఎలాంటి గ్రూపులు లేవని స్పష్టం చేశారు. దీంతో బుద్ధా వెంకన్న సోము వీర్రాజుకు రివర్స్ ఆఫర్ ఇచ్చారు. ‘మీరే మాతో కలిసి పనిచేయండి. టీడీపీ ప్రభుత్వం వచ్చాక కేబినెట్ లోకి తీసుకుంటాం’ అని చెప్పారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు కొద్దిసేపు పిచ్చాపాటిగా మాట్లాడుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు
వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రజల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడిందన్న రాంమాధవ్ వ్యాఖ్యలను ప్రత్యేకంగా చూడాల్సిన పని లేదన్నారు. తాము ఎదగాలంటే ఎవరినైనా తిట్టాల్సిందే అన్నారు. టీడీపీ చితికిపోతేనే ఇక్కడ బీజేపీ ఎదుగుతుందని చెప్పారు.