Saturday, April 27, 2024
- Advertisement -

అమరావతి పేరు వింటేనే వణుకుతున్న బాబు!

- Advertisement -

అమరావతి ఇప్పుడు ఈ వింటేనే టీడీపీ అధినేత చంద్రబాబు వెన్నులో వణుకు పడుతోంది. ఏపీ రాజధానిగా అమరావతి అంటూ అధికారం కొల్పోయిన దగ్గరి నుండి పదేపదే ప్రస్తావిస్తూ వస్తున్నారు చంద్రబాబు. అమరావతే రాజధానిగా ఉండాలని పేయిడ్ ఉద్యమాన్ని నడిపిస్తున్నరన్న అపవాదు కూడా చంద్రబాబుపై ఉంది. అయితే ఇప్పటివరకు అంతా బాగానే ఉన్న కాలం ఎప్పటికి మనకు అనుకూలంగా ఉండదు కదా. అందుకు ఇప్పుడు అదే అమరావతి బాబు మెడకు ఊరి తాడులా మారింది.

గతంలో ఎన్నిసార్లు అవినీతి ఆరోపణలు, ఎంక్వైరీలు జరిగిన వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొన్న బాబుకు ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. దీంతో స్వయంగా బాబే తన అరెస్ట్ తప్పదంటూ సంకేతాలిచ్చేశారు. ఎందుకంటే అమరావతి రాజధాని నిర్మాణంలో దాదాపు రూ.118 కోట్ల అవినీతి జరిగిందని ఐటీ శాఖ తేల్చగా ఈ సమస్య నుండి చంద్రబాబు అంతా ఈజీగా బయటపడే అవకాశం కనిపించడం లేదు. అందుకే తాను నిప్పు అంటూ సానుభూతి పొందే ప్రయత్నం బాబుగారు చేసినా అది ప్రజల్లో అంత వర్కవుట్‌ అయినట్లు కనిపించడం లేదు. ఎందుకంటే జరిగిన అవినీతి బాగోతం మొత్తాన్ని పూస గుచ్చినట్లు ఎవరెవరి దగ్గరి నుండి ఎంత ముట్టాయో మనోజ్ వాసుదేవ్‌తో పాటు శ్రీనివాస్ వెల్లడించారు. ఇదే విషయాన్ని నోటీసుల్లో కూడా స్వయంగా వెల్లడించింది ఐటీ శాఖ.

మరోవైపు అమరావతి భూ కుంభకోణంలో చంద్రబాబును విచారించేందుకు సీఐడీ రెడీ అవుతున్నట్లు సమాచారం. అన్ని కష్టాలు ఒకేసారి తన మెడకు చుట్టుకోవడంతో బాబు పరిస్థితి ముందునుయ్యి వెనుక గొయ్యిలా తయారైంది. ఓ వైపు ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలతో చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇక వైసీపీ నేతలు ఇదే అదునుగా బాబుపై విమర్శలు తీవ్రతరం చేశారు. ఇప్పటివరకు ఒక్క వైసీపీనే చంద్రబాబను టార్గెట్ చేయగా ఇకపై మిగిలిన ప్రతిపక్షాలు కూడా రెడీ అవుతుండటంతో బాబుకు చక్కలు కనిపించడం ఖాయం అని పలువురు భావిస్తున్నారు. ఏదిఏమైనా చంద్రబాబు రాజకీయ జీవితంలో ఇంత సంక్లిష్ట సమయాన్ని ఆయన ఎప్పుడు చూడలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -