Saturday, April 27, 2024
- Advertisement -

ప్రజల కష్టాలు దగ్గరుండి చూశారు.. ఆయన ఓ చరిత్ర : మోపిదేవి వెంకటరమణ

- Advertisement -

ఓ వ్యక్తి చరిత్ర సృష్టించాలంటే ఎంత కష్టపడతారో ప్రతి ఒక్కరికీ తెలిసిందే. కోటి మందిలో ఏ ఒక్కరికో ఆ అదృష్టం దక్కుతుంది. ఇక ప్రజల కష్టాలు తీర్చేందుకు ఎంతో మంది గొప్ప వ్యక్తులు భూమిపై పుట్టారు.. చరిత్ర సృష్టించారు. ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓ చరిత్ర అని వైసీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ అన్నారు. పాదయాత్ర సందర్భంగా ప్రజల స్థితిగతులను జగన్ కళ్లారా చూశారని మోపిదేవి చెప్పారు.

గత ప్రభుత్వాలు బీసీల్లోని నాలుగు కులలకే ప్రాధాన్యతను ఇచ్చేవని… పదవున్నీ ఆ నాలుగు బీసీ కులాలకు దక్కేవని చెప్పారు. జగన్ మాత్రం బీసీల్లోని అన్ని కులాలకు ప్రాధాన్యతను ఇస్తున్నారని అన్నారు. రాజకీయ ఆరంగేట్రం నుంచి ముఖ్యమంత్రి అయ్యేంత వరకు జగన్ ది ఒక చరిత్ర అని అన్నారు.

బీసీ కార్పొరేషన్ల  ఛైర్మన్లు, సభ్యులు అందరూ జగన్ ఆశయాలను జనాల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని చెప్పారు. గుంటూరులో ఈరోజు ‘జయహో జగనన్న’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సదర్భంగా మోపిదేవి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

టీడీపీ చేతుల్లోంచి ఆ వర్గాన్ని తెలివిగా లాక్కున్న వైసీపీ..?

ఎన్ని కుప్పిగంతులు వేసిన జగన్ ముందు పనిచేయవు..?

చంద్రబాబు చెప్పేది మరీ చోద్యంగా ఉంది..?

చంద్రబాబు తీరు టీడీపీ ఎమ్మెల్యేల కు నచ్చలేదా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -