టీడీపీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి తిరు బాబు టీడీపీలో కలకలం రేపుతోంది. తాను అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోరు. గతంలో అనేక సార్లు సీఎం చంద్రబాబునె ముప్పుతిప్పలు పెట్టిన జేసి కొన్ని పనులు సాధించుకున్నారు. ఇప్పుడు కూడా తన పంతాన్ని నెగ్గించేకొనేదుకు టీడీపీ అధిష్టానానికి అల్టిమేట్టం జారా చేశారు. అనంతపురం జిల్లా అభ్యర్థల జాబితాపై జేసీ గుర్రుగా ఉన్నారు.తాను చెప్పినట్లు కొన్ని నియోజక వర్గాల్లో అభ్యర్థలను మార్చాలని పార్టీ అధిష్టానానికి తుది హెచ్చరిక చేశారు.
అనంతపురం నుంచి తన తనయుడికి తెలుగుదేశం పార్టీ టికెట్ ను ఖరారు చేసుకున్న దివాకర్ రెడ్డి గెలపు కోసం తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. ఇందులో భాగంగానె శింగమనల, కల్యాణదుర్గం, గుంతకల్లు అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. దాంతో పాటు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరితో వైరం కారణంగా ఆయన కూడా గెలిచే అవకాశం లేదంటూ చంద్రబాబుకు తెలిపినట్టు తెలుస్తోంది. ఈ నాలుగు స్థానాల్లో అభ్యర్థలను మారిస్తేనె ఎంపీగా గెలుస్తామని తేల్చిచెప్పారు. ఆ నాలుగు నియోజక వర్గాల్లో
అభ్యర్థలను బాబు ప్రకటించిన తర్వాత పోటీలో ఉండాలా? లేదా? అన్నది నిర్ణయించుకుంటామని కుండబద్దలుకొట్టారు.
ప్రస్తుతానికి అయితే ఆ సీట్లను చంద్రబాబు నాయుడు పెండింగ్ లోనే ఉంచారు. జేసీకి తలొగ్గి ఎలాంటి మార్పులు చేయవద్దని చంద్రబాబుకు కీలక నేతలు సూచించినట్టు సమాచారం. ఇలాంటి నేపథ్యంలో జేసీ హెచ్చరికల మేరకు ఆయన చెప్పినట్టుగా అభ్యర్థులను ఖరారు చేస్తారా లేక చంద్రబాబు తన సొంత నిర్ణయాలే తీసుకుంటారా అనేది ఆసక్తిదాయకంగా మారింది.